జీఎస్టీ పరిహారం కోసం కేంద్రంతో కేసీఆర్ ఢీ..! మరి జగన్..!?

కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆయన ఎజెండా జీఎస్టీ పరిహారం కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ .. ఒక్క ఏపీ సీఎం జగన్ తప్ప… కేంద్రం వైఖరిని తప్పు పడుతున్నారు. బీజేపీ సీఎంలకూ ఇబ్బందే. కానీ.. వారు నోరు మెదపలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రానికి వ్యతిరేకంగా తన అభిప్రాయం చెప్పలేకపోతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం వెనుకడుగు వేయడానికి సిద్ధంగా లేరు. కలిసొచ్చే సీఎంలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల మధ్య జీఎస్టీ పరిహారం విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. జీఎస్టీ చట్టం ప్రకారం.. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం తగ్గితే.. ఆ మేరకు.. మొత్తం కేంద్రం భర్తీ చేయాల్సి ఉంటుంది. కరోనా లాక్ డౌన్, తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా రాష్ట్రాలు నష్టపోయిన మొత్తం దాదాపుగా రూ. మూడు లక్షల కోట్లు ఉంది.

చట్టం ప్రకారం.. ఆ మొత్తం రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేయాలి. అయితే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కరోనాను “యాక్ట్ ఆఫ్ గాడ్‌”గా ప్రకటించి కేంద్రం నుంచి ఎలాంటి పరిహారం రాదని ప్రకటించేశారు. కావాలంటే.. అప్పులు తీసుకుని కట్టుకోవాలని సలహా ఇచ్చారు. రెండు ఆప్షన్లను రాష్ట్రాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. ఈ రెండు ఆప్షన్లపై కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. అయితే.. జీఎస్టీ పరిహారం కోసమే.. ఆయన పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ములు కాబట్టి.. ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు. ఒక వేళ కేంద్రం వద్ద అప్పు తీసుకుంటే.. రాష్ట్రంపై భారం పెరగడమే తప్ప… అదనపు ప్రయోజనం ఉండదని అంటున్నారు.

తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రుణఊబిలో ఉంది. జీఎస్టీ పరిహారం కూడా ఏపీకి ఎక్కువే రావాల్సి ఉంది. అయితే.. చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని… కేంద్రాన్ని నిలదీసిన సందర్భం ఇటీవలి కాలంలో కనిపించలేదు. అలా అని.. తెలంగాణ సీఎంతో కలిసి పోరాడేందుకు కూడా సిద్ధం కావడం లేదు. కేంద్రం ఇస్తే తీసుకుందాం.. లేకపోతే.. అప్పులకు చాన్సిస్తే.. అవే తీసుకుందాం అన్నట్లుగా ఉంది కానీ… చట్టం ప్రకారం రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close