బండి సంజయ్‌కు కేటీఆర్ ఫైనల్ వార్నింగ్..!

తెలంగాణ మంత్రి కేసీఆర్‌కు కోపం వచ్చింది. తన తండ్రి కేసీఆర్ హోదా, వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాతున్నారంటూ వరంగల్‌లో ఆయన ఫైరయ్యారు.  ఇదే చివరి వార్నింగ్ అని విపక్ష నేతలకు స్పష్టం చేసింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. మోడీ, అమిత్ షాలను కూడా వదిలి పెట్టకుండా మాట్లాడతామని హెచ్చరించారు. కేసీఆర్ ఆవేశానికి కారణం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎక్కడా దూకుడు తగ్గడం లేదు. భాషలో కేసీఆరే తన గురువు అని.. తాను గురుదక్షిణ సమర్పించుకుంటానంటూ ఆయన చెలరేగిపోతున్నారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా వారికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ఏమైనా అంటే.. వారిపై దూకుడుగా చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రెడీగా ఉంటుంది. కానీ బీజేపీ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మాటలతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాటల ద్వారా బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో టీఆర్ఎస్ లేదు. నిజంగా బండి సంజయ్ తరహాలో విరుచుకుపడాలంటే టీఆర్ఎస్ దగ్గర భాషా  పండితులు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరూ బీజేపీపై ఘాటు భాష ఉపయోగించకూడదన్న సంకేతాలు హైకమాండ్ నుంచి వచ్చాయి. అందుకే చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ నేతలు సంయమనం పాటిస్తున్నారు. 

అయితే టీఆర్ఎస్ నేతల సంయమనం… చేతకానితనంగా బీజేపీ నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే వారు జోరు పెంచుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. చివరి సారిగా చెబుతున్నానని కూడా హెచ్చరించారు. బండి సంజయ్ మళ్లీ కేసీఆర్ పై తన పాత లాంగ్వేజ్‌లోనే విరుచుకుపడతారా.. కేటీఆర్ వార్నింగ్ ను చూసి ఆగిపోతారా అన్నది ఆసక్తికరమే. అయితే బండి సంజయ్ అలా ఆగకపోతే.. కేటీఆర్ ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరమే. సాగర్ ఎన్నికల ఫలితం తర్వాత ఈ రాజకీయం మరింత రాజుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close