రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలనూ జగన్ రెడ్డి ఉపయోగించుకున్నట్లుగా మరోసారి స్పష్టమైంది. భారతి సిమెంట్స్ విషయంలో ల్యాప్స్ అయిపోయిన లీజులను అడ్డగోలుగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవస్థల్ని ఉపయోగించుకుని భారతి సిమెంట్స్ కు కేటాయింపు చేసుకున్నారు. ఇప్పుడీ విషయం వెలుగులోకి వచ్చింది. పెను సంచలనంగా మారుతోంది.
రఘురాం సిమెంట్స్ లీజులు భారతీ సిమెంట్స్కు – రూల్స్ కు వ్యతిరేకం
భారతి సిమెంట్స్ అసలు పేరు భారతి సిమెంట్స్ కాదు. రఘురాం సిమెంట్స్. ఆ పేరుతో ఉన్న కంపెనీని జగన్ రెడ్డి అణా ,కాణి పైసలతో సొంతం చేసుకున్నారు. రఘురాం సిమెంట్స్ కంపెనీకే సున్నపురాయి లీజులు ఉన్నాయి. భారతి సిమెంట్స్ గా మారిన తర్వాత ఆ లీజుల్ని కూడా కంపెనీ వాడేసుకుంటోంది. భారతి సిమెంట్స్ ను.. ప్రొడక్షన్ ప్రారంభం కాక ముందు 51శాతం వాటాను రెండువేలా కోట్లకు వికాట్ అనే కంపెనీకి అమ్మేశారు. కానీ ఆ కంపెనీ ఎప్పుడూ ఈ భారతి సిమెంట్స్ యాజమాన్యాన్ని చూసుకోలేదు. భారతి రెడ్డే చూసుకుంటూ ఉంటారు. అందుకే భారతి సిమెంట్స్ కూడా మాది కాదని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గపడరు.
కేంద్ర పాలసీ ప్రకారం లీజుల్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
కేంద్రం గనుల విషయంలో చాలా స్పష్టమైన పాలసీ తీసుకుంది. ఓ కంపెనీ పేరుతో లీజులు తీసుకుని మరొకరు ఆ కంపెనీని టేకోవర్ చేస్తే లీజులు చెల్లవని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తులు చేసుకుని ఉన్నా సరే.. అవి ల్యాప్స్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో భారతి సిమెంట్స్ లీజులు గందరంగోళంగా పడ్డాయి. 2017లో ఏపీ ప్రభుత్వం రఘురామ్ సిమెంట్స్ కు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని రద్దు చేసింది.
ఓ మాజీ న్యాయమూర్తి న్యాయసలహా.. ఏజీ సూచనలు అని లీజు పునరుద్ధరణ
జగన్ అధికారంలోకి వచ్చాక లీజులను మళ్లీ తన కంపెనీ పేరుతో లీజులను పునరుద్ధరించుకునేందుకు అడ్వకేట్ జనరల్ ను పావుగా వాడుకున్నారు. అసలు విషయాలాన్ని దాచేసి.. అడ్వాకేట్ జనరల్ నుంచి న్యాయసలహా అంటూ లీజుల్ని పునరుద్ధరించేసుకున్నారు. నిబంధనల ప్రకారం అనుసరించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా న్యాయసలహా పేరుతో దోచుకున్నారు. ఓడిపోతామని స్పష్టంగా తెలియడంతో ..ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలోనే లీజుల్ని పునరుద్ధరిస్తూ జీవోలు జారీ చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కేంద్రం విచారణ చేయాలని రాష్ట్రానికి లేఖ రాసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ గుట్టు బయట పెట్టాల్సి ఉంది. జగన్ రెడ్డి తన లబ్ది కోసం ఇప్పుడు ఓ మాజీ న్యాయమూర్తిని, అడ్వకేట్ జనరల్ ను కూడా నిండా ముంచుతున్నారన్నమాట. వారు కూడాజైలుకు వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. నేరస్తులతో కలిసి నేరపూరిత కుట్రలకు పాల్పడితే ఇలాంటి పరిస్థితే.