క్రైమ్ : తనకంటే 9ఏళ్ల చిన్నోడితో ప్రేమ… ! గర్భం వచ్చిందని ప్రాణం తీసుకున్న ప్రొఫెసర్..!

ప్రేమించడానికి వయసు తేడా అడ్డు రాలేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం సమాజం గురించి భయపడ్డారు. చివరికి ప్రాణం తీసుకున్నారు. ఆమె వయసు ఇరవై ఎనిమిది. అతడి వయసు పందొమ్మిది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కుటుంబాలకు తెలియకుండా కలసి గడిపారు. ఆమె గర్భవతి అయింది. ఇద్దరి మధ్య వయసుతేడా తొమ్మిదేళ్లు ఉంది. అదే అమ్మాయి చిన్న అయితే .. అసలు విషయమే అయి ఉండేది కాదు..కానీ ఇక్కడ అబ్బాయి చిన్నవాడు. సమాజానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక.. వారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ కొత్త తరహా విషాదాంత ప్రేమ కథ .. కృష్ణాజిల్లాలో జరిగింది.

విజయవాడలోని ఓ లాడ్జిలో రెండు రోజుల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని గన్నవరం మండలం తెంపెల్లి గ్రామానికి చెందిన నాగగౌతమి, గుడివాడకు చెందిన లోకేష్‌గా గుర్తించారు. ఆమె వయసు ఇరవై ఎనిమిది. లోకేష్ వయసు పందొమ్మిది. లోకేష్‌, గౌతమి కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. ఇంట్లో పెళ్లికి పెద్దల్ని ఒప్పించలేకపోయారు. ఆమె కనీసం తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. గర్భవతి కావడంతో ఆందోళనలో ఉన్నట్లు డైరీలో రాసింది గౌతమి. గౌతమి గౌతమి పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో అదే కాలేజీలో చదువుతున్న లోకేష్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

ప్రస్తుతం పాలిటెక్నిక్‌ మూడో ఏడాది చదువుతున్నాడు లోకేష్‌. ఆత్మహత్యాయత్నంతో గౌతమి మృతి చెందింది. లోకేష్ కొనఊపిరితో ఉన్నాడు. ప్రేమించినప్పుడు ధైర్యం ఉండాలని.. సినిమాల్లో చూసుంటారు కానీ.. నిజ జీవితంలో మాత్రం.. వీరు ధైర్యం చేయలేకపోయారు. ప్రాణాలు తీసుకోవడమే తేలికనుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close