ఏపీ సీఎస్‌గా ఎల్వీ కొనసాగింపు..! డీజీపీని మార్చుతారా..?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనసాగడం ఖాయమయింది. వైసీపీ గెలిచిన విషయం తెలిసిన వెంటనే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఘనవిజయం సాధించడంపై జగన్‌ను అభినందించారు. 30వ తేదీన ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని.. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సూచించారు. తనను సీఎస్‌గా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం కాబట్టి… జగన్‌కు ఏమైనా ఆప్షన్ ఉందా.. అని అడిగారు.. ఎల్వీ. రిటైర్మెంట్‌కు ఇంకా ఏడాది ఉంద‌ని తెలుసుకున్నాను.. మా ప్రభుత్వంలో కూడా మీరే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అని జ‌గ‌న్ ఎల్వీకి హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో… సమావేశాన్ని ఎల్వీ ఏర్పాటు చేశారు. నీతి వంతమైన పాలన అందించడమే తమ లక్ష్యమని.. ఎల్వీకి జగన్ స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అజేయకల్లాం..!

చంద్రబాబునాయుడు హయాంలో.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా .. స్వల్పకాలం పని చేసి రిటైర్ అయిన కల్లాం అజేయరెడ్డి అలియాస్ అజేయకల్లాం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులవడం లాంఛనమే. ఆయన ఆధ్వర్యంలో పని చేయాలని.. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి జగన్మోహన్ రెడ్డి సూచించారు. సీఎంగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత.. నియామకాల ప్రక్రియలో మొదటగా అజేయకల్లాం పేరు ఉండే అవకాశం ఉంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత అజేయకల్లాం.. పూర్తి స్థాయిలో.. వైసీపీకి మద్దతుగా పని చేయడం ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ.. అవినీతి ముద్ర వేస్తూ.. అనేక వర్క్ షాపులు నిర్వహించారు. దానికి ప్రతిఫలంగా ప్రభుత్వ సలహాదారు పదవి లభించే అవకాశం ఉంది.

డీజీపీగా సవాంగ్‌ను నియమిస్తారా..?

ప్రతిపక్షంలో ఉండగా.. వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారుల్లో.. డీజీపీ ఒకరు. డీజీపీ ఠాకూర్‌పై… వైసీపీ నేతలకు చాలా మందికి కోపం ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు… డీజీపీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అంతా.. జగన్ ప్రొత్సాహంతోనే జరిగిందని ఆయన చెబుతూ ఉంటారు. ఆ కారణంగా చూస్తే… డీజీపీగా ఠాకూర్‌ను కొనసాగించే అవకాశం లేదు. ఆయనను తప్పిస్తారని అంటున్నారు. అయితే.. ఇలా డీజీపీ లాంటి అత్యున్నత అధికారిని.. మధ్యలో తప్పించడం సంప్రదాయం కాదు. డీజీపీ ఎలాగూ ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడతారు కాబట్టి… కక్ష సాధింపుగా భావించకపోతే తప్ప.. ఆయననే కొనసాగిస్తారు. లేపోతే.. గౌతం సవాంగ్‌ను నియమిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి .. డీజీపీ నియామకం సమయంలో.. సవాంగ్, ఠాకూర్ ఇద్దరూ పోటీ పడ్డారు. చంద్రబాబు ఠాకూర్ వైపే మొగ్గారు.

జగన్ ప్రాపకం కోసం ఉన్నతాధికారుల హడావుడి..!

నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ గెలుస్తుందనే మౌత్ టాక్ ప్రారంభం కావడంతో… చాలా మంది అధికారులు… జగన్ క్యాంప్‌నకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అధికారిక రహస్యాలు… పంపడం దగ్గర్నుంచి… టీడీపీ నేతలను పట్టించుకోకపోవడం వరకూ.. చాలా అంశాలపై అతిగా స్పందించారు. ఇదంతా.. మంచి పోస్టింగ్‌ల కోసమేనన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close