జోడి నెంబర్ వన్ నరేంద్రమోడీ, అమిత్ షా..!

వరుసగా రెండో సారి సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రెడిట్ అంతా… నరేంద్రమోడీ, అమిత్ షాలదే. ఒకరు పార్టీని.. మరొకరు ప్రభుత్వాన్ని శాసిస్తూ… అత్యుతన్నత స్థాయికి తీసుకెళ్లారు. వరుసగా రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెసేతర నేతగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. తిరుగులేని నాయకుడిని ఆయన నిరూపించుకున్నారు. ఈ విజయం వెనుక ఉన్న ఒకే ఒక్క వ్యూహకర్త బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. మోడీకి నీడలా ఉంటూ.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ.. వెనుక ఉండి నడిపించిన నేత అమిత్ షా.

మోడీని చూపి బీజేపీని మార్కెట్ చేసిన అమిత్ షా..!

2014లో అమిత్ షా రోల్‌కు 2019లో అమిత్ షా పాత్రకు చాలా తేడా ఉంది. ఐదేళ్ల క్రితం అమిత్ షా అప్పుడే దేశ రాజకీయాల్లోకి వచ్చారు. యూపీ ఎన్నికలకు ఆయనకు తొలి పరీక్షగా చెప్పుకోవాలి. అమిత్ షా యూపీ ఎన్నికల్లో తన వ్యూహాన్ని అమలు జరిపారు. కింది స్థాయిలో వేగవంతంగా పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీకి ఓటర్లకు మధ్య అనుసంధానకర్తలుగా కొందరు ద్వితీయ శ్రేణి నేతలను తయారు చేశారు. బీజేపీ గెలిస్తే ఒనగూరే ప్రయోజనాన్ని ఓటర్లకు చెప్పగలిగారు. ప్రతీ పోలింగ్ బూత్‌లోనూ అమిత్ షా తిరిగినంతంగా ఆయన శ్రమ పడ్డారు.

పార్టీ నలుదిశలా వ్యాపింప చేసిన అమిత్ షా, మోడీ..!

మూడు హిందీ రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయినా కూడా మోదీ, అమిత్ షా ఎక్కడా నిరాశ చెందలేదు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో గెలిచినా సీట్లు తగ్గిప్పుడు భయపడలేదు. గుజరాత్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పై మోదీ, షా ద్వయం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ నాలుగు రాష్ట్రాల్లో గెలుపుకోసం వ్యూహాలు రచించింది. పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చాయో, ఎక్కడ పురోగమనం సాధ్యమో అంచనా వేసుకున్నారు. తమ అంచనాకు తగ్గట్టుగా పార్టీ కింది స్థాయి నేతలను సమాయత్తం చేశారు. దేశం మొత్తం బీజేపీ స్థానిక పరిస్థితులను బట్టి వ్యూహాలను అమలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనేతలిద్దరూ తిరగని నియోజకవర్గం లేదు. మోదీకి అమిత్ షాపై అమితమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని పార్టీ అధ్యక్షుడు వమ్ము చేయలేదు. తనకు రాజ్యసభ సభ్యత్వం వచ్చిన తర్వాత అమిత్ షా మరింత ఉత్సాహంతో పనిచేశారు. రిస్క్ తీసుకుంటేనే పార్టీకి ఘన విజయం సాధ్యమని మోదీకి నూరిపోసిన వ్యక్తి అమిత్ షా. పాతతరాన్ని పక్కన బెట్టి కొత్తతరాన్ని ప్రోత్సహించడంతో పాటు గెలుపు గుర్రాలెవ్వరో నిర్ణయించడంలో మోదీకి అమిత్ షా వెన్నుదన్నుగా నిలిచారు.

ఇక దక్షిణాదిపై దృష్టి పెడతారా..?

అమిత్ షా రోల్ మరింతగా పెరగబోతోంది. అమిత్ షాకు రక్షణ శాఖ అప్పగించే అవకాశం ఉందని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అమిత్ షా అక్కడ హోమ్ మంత్రిగా పనిచేశారు. అందుకే ఆయనకు కేంద్ర హోం మంత్రి పదవి కట్టబెట్టినా ఆశ్చర్యం లేదని కొందరంటున్నారు. ఏ శాఖను అప్పగించినా మోదీ నేతృత్వంలో అమిత్ షా మరింత బరువు బాధ్యత వచ్చి పడటం మాత్రం ఖాయం. ఇప్పుడు అమిత్ షా ఇక బెంగాల్‌లో వచ్చిన విజయాన్ని సుస్థిరం చేసుకోవడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దక్షిణాదిన పార్టీని విస్తరించేందుకు ఆయన ప్రయత్నిస్తారు. వారిని ఆపడం అంత తేలిక కాదు.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close