తిరుమల కొండల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మంటలు ఎగసిపడ్డాయి. దీంతో వంద మీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతి అయింది.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల తిరుమలను బేస్ చేసుకొని రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు వచ్చాయి. మొదట గోవుల మృతి అంటూ రాజకీయం చేసేందుకు ప్రయత్నించినా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత తిరుమల క్యూలైన్ లో వైసీపీ నేత టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి గందరగోళం సృష్టించాలని చూశారు.
దీంతో తిరుమలలో వైసీపీ మతవిద్వేషాలను రగిల్చి లబ్ది పొందాలని చూస్తుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.