వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ కోరుకున్న డోస్ ఇచ్చేశారు. రాజమండ్రి వేమగిరిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ.. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్ తో పెరిగిందన్నారు.

వైసీపీకి 5 సంవత్సరాలు పాలించే అవకాశం వచ్చినా.. వారు ఉపయోగించుకోలేకపోయారని తెచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిందని .. అందుకే వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని ప్రకటించారు. అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదని ప్రకటించారు. మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేశారని.. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్‌ స్పీడ్‌తో పరిగెత్తిందన్నారు. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని… అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారై దోపిడీకి పాల్పడ్డారన్నారు.

కేంద్ర నిధులను ఎన్నో విధాలుగా ఇస్తున్నా అందుకోలేకపోయిదని మోదీ విమర్శించారు. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలనుకున్నాం కానీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు అన్నదన్నారు. చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా దోపిడీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుందని ..పీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ అన్నారు.

అమిత్ షా , ప్రధాని మోదీ ఒక్క రోజు వ్యవధిలోనే జగన్ రెడ్డి సర్కార్ పై ఈ స్థాయిలో విరుచుకుపడంట వైసీపీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ మీడియా ఇంటర్యూల్లో కంగ్రెస్ ను విమర్శించి.. తాము బీజేపీ వైపే ఉంటామన్న సంకేతాలను జగన్ ఇచ్చినా బీజేపీ అగ్రనేతలు కనీసం పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కు అలా అనిపించలేదా ?

" ఈ రోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు" అని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close