మోడీ సీరియస్ .. చైనాకు సర్జికల్ స్ట్రైక్స్ తరహా ఆన్సర్ ..!?

సరిహద్దుల్లో ఇరవై మంది భారత సైనికుల్ని చైనా దళాలు చంపేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ అయ్యారు. చైనా రెచ్చగొట్టే చర్యలకు బదులిచ్చే సత్తా ఉందని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్విగ్న పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమరులైన సైనికుల త్యాగాలు వృధా కాబోవని ప్రకటించారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం వంటి విషయాల్లో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. భారత్ శాంతిని కోరుకుంటుందని అలా అని రెచ్చగొడితే.. చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. త్యాగాలు, వెనుకడుగు వేయకపోవడం..ధైర్య సాహసాలు మన జాతి లక్షణాలు అని మోడీ చెప్పుకొచ్చారు.

చైనా దుందుడుకు చర్యలపై మోడీ సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన పందొమ్మిదో తేదీన సాయంత్రం… అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ సహా.. మొత్తం ఘటనను వివరించనున్నారు. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు ఆయన మద్దతు అడగనున్నారు. గతంలో.. కశ్మీల్‌లో పుల్వామాలో బాంబు దాడి జరిగినప్పుడు… ఇలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా.. మద్దతిస్తామన్న హామీని పొందారు. ఆ తర్వాతే పాకిస్తాన్‌పై సర్జికల్ స్టైక్స్ చేశారు. పెద్ద ఎత్తున తీవ్రవాద క్యాంపుల్ని ధ్వంసం చేశామని.. ఆనాడు ప్రభుత్వం ప్రకటించుకుంది.

ఇప్పుడు చైనా అంత కంటే.. ఎక్కువగా భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తోంది. నేరుగా కాల్పులు జరపకపోయినా.. అత్యంత క్రూరంగా సైకనికుల్ని కొట్టి చంపింది. ఇది క్షమించరానిదిగా.. భారత సమాజం భావిస్తోంది. చైనా విషయంలో ఏ మాత్రం.. మెత్తగా ఉన్నా.. ఆ దేశం మరింత దుందుడుకుగా.. ఉంటుందని.. మన శాంతిని .. చేతకాని తనంగా భావిస్తుందన్న చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి మోడీ తో పాటు.. సలహాదారులు కూడా అదే భావనలో ఉన్నారంటున్నారు. చైనాకు ఇప్పుడు ధీటుగా సమాధానం చెబితేనే చొరబాట్లు ఆగిపోతాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం.. భారత్‌వైపే ఉంటుందని.. దూకుడుగా సర్జికల్ స్టైక్స్ తరహా చర్యలు తీసుకోవాలన్న సూచనలు కేంద్రానికి పెద్ద ఎత్తున వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close