మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి కాంగ్రెస్ నేత కాదు. ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. కర్ణాటక వెళ్లి.. డీకే శివకుమార్ తో భేటీ అయి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పేరును తుంగతుర్తి సీటుకు పరిశీలించారు కానీ.. కోమటిరెడ్డి బ్రదర్స్ .. తమ అనుచరుడికే సీటు ఇప్పించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో అయినా తనకు సీటు గురించి ఆలోచిస్తారేమోనని మోత్కుపల్లి నరసింహులు ఆశించారు. కానీ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. కడియం శ్రీహరిని చేర్చుకుని ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వడంతో మరింతగా ఫైరవుతున్నారు. ఆయన మాదిగ నేత కాదని.. ఆయన కులమేటో తెలియని అంటున్నారు. మంద కృష్ణ మాదిగ చేస్తున్న విమర్శలు కరెక్టేనంటున్నారు. మోత్కుపల్లి మాదిగ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఆయన మాటల్లోనే స్పష్టమయింది. తనకు రేవంత్ ఇంత వరకూ అపాయింట్ మెంట్‌ ఇవ్వలేదని అంటున్నారు. అదే సమయంలో జితేందర్ రెడ్డినిరాత్రికి రాత్రి చేర్చుకుని పదవి ఇచ్చారని తమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం.. టిక్కెట్ కాకపోయినా ఏదో ఓ పదవి ఇవ్వాలని అర్థం.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే. నాయకుడితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని పదవిపొందాలి కానీ ఇలా రెబల్ గా వ్యవహరించి.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా విమర్శలు చేసి.. పదవి కావాలంటే ఎలా ఇస్తారన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. పైగామోత్కుపల్లి కాంగ్రెస్ కోసం పని చేసిన వ్యక్తి కాదు. ఎన్నికలకు ముందు చేరారు. గతంలో ఆయన తిట్టని నేత లేరు. చివరికి ఎన్టీఆర్ ను కూడా తిట్టారు. చంద్రబాబును.. కేసీఆర్.. బీజేపీ ఇలా ఏ పార్టీని వదల్లేదు. ఫెయిల్డ్ పాలసీ అయినా .. మోత్కుపల్లి అదే పాటిస్తున్నారు. ఎవరికీ కాకుండా పోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close