ఇద్దరు ప్రభాకర్‌ల మధ్య పవన్‌

తన తొలి రాజకీయ యాత్రకు ముందు కరీం నగర్‌ జిల్లాలోని కొండగట్టు ఆంజన్నను సందర్శించాలని నిర్ణయించుకోవడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌ కొత్త తరహా చర్చకు కారణమైనారు. ఎపిలో కాకుండా తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన సెంటిమెంటల్‌ కారణాలు చెప్పారు.కాని టిఆర్‌ఎస్‌తో రహస్య అవగాహన వుండటం వల్లనే పవన్‌ ఇక్కడ ప్రవేశిస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. పవన్‌ తెలంగాణ వ్యతిరేకి అని కూడా వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్‌ ఈ ఆరోపణలను కొట్టి పారేయడానికి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. అంటే పవన్‌ను తమతో ముడిపెట్టే కథనాలను వెంటనే ఖండించడం అవసరమని భావించారన్నమాట. అయితే ఆయనను వ్యతిరేకిగా గాక జనాదరణ గల సినిమా నటుడుగానే అభివర్ణించారు.కొండగట్టు నుంచి ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. పవన్‌కు సంబంధించి ఇది మంచి పరిణామమే. అయితే ఆయన మద్య మధ్యలో వచ్చి పోయే నట నాయకుడని తన వల్ల లాభం నష్టం ఏమీ వుండవని కర్నె వ్యాఖ్యానించారు. అంతకంటే కీలకమేమంటే కెసిఆర్‌తో పవన్‌ కలిసింది అజ్ఞాతవాసి చిత్రం అయిదు షోల అనుమతి కోసమే తప్ప రాజకీయాలు కోసం కాదని వున్న మాట చెప్పేశారు.అయితే ఆయన కలిసినప్పుడు మాత్రం అధికార మీడియా బాగానే ప్రచారం చేసుకుంది. ఇతర విషయాలు కూడా వచ్చాయి. పవన్‌ కొన్ని కితాబులిచ్చారు కూడా. ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం సినిమా కోసమేనని అది కూడా కెసిఆర్‌ హామీ ఇవ్వకుండా సంబంధిత మంత్రి దగ్గరకు పంపించారని కర్నె చెబుతున్నారు. పవన్‌ కలిసింది ఆ చిత్రం కోసమేనని మీడియాలోనూ రాజకీయ పార్టీల్లోనూ చాలా మందికి తెలుసు గాని ఇలా చెప్పడం ఇబ్బందే. ఏదైతేనం ఇద్దరు ప్రభాకర్‌ల కారణంగా అసలు సంగతి బయిటకొచ్చిందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close