దసరా నుంచి విశాఖ పాలన .. ఉత్తదే !

జగన్ అనుకున్నారు.. డిసైడ్ అయిపోయారు. మైండ్ లో అనుకుంటే బ్లైండ్‌గా వెళ్లిపోతారు అని వైసీపీ నేతలు చాలా మాటలు చెప్పారు కానీ అంతా ఉత్తదేనని తేలిపోయింది. దసరా నుంచి విశాఖలో జగన్ పాలన మొదలు పెడతారని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోయినట్లేనని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఈ దసరాకు తాడేపల్లి నుంచే పాలన చేయనున్నారు. వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో జరిగిన ప్రచారం అంతా ఉత్తదేనని తేలిపోయింది.

నిజానికి ఇది మొదటి సారి కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి ఇదే కథ. ఇక జగన్ విశాఖ వెళ్లడమే మిగిలిందని ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం ముందుకు రావడంలేదు. సీఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చని..గతంలో జగన్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మాట ప్రకారం అయినా కొంత కాలం వైజాగ్‌లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. కానీ అలాంటి ప్రయత్నం చేయడం లేదు. కానీ ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు.

వైజాగ్‌లో సీఎం పరిపాలన ప్రారంభిస్తే అసలు సమస్యలేమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూడు రాడధానులు కాదు.. అనధికారికంగా రెండు రాజధానులు ఉన్నా.. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో తెలుస్తుంది.అధికార వర్గం కిందా మీదా ఎలా పడుతుందో తెలుసుకోవచ్చు. సమస్యలన్నీ ప్రాక్టికల్‌గా అర్థమవుతాయి. అయితే పాలకులు మాత్రం తమ సమస్యల గురించి తెలుసు కాబట్టి ప్రజలతో ఎమోషనల్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు…తప్ప.. వారికీ చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close