పెద్ద ఆధారాలేం దొరకలేదట!

డ్రగ్స్‌ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను గంటల తరబడి విచారించడంపై హల్‌చల్‌ మీడియాకు అక్కరకు వచ్చింది గాని చెప్పుకోదగిన ఆధారాలేం దొరకలేదట. ఇది బాధ్యత గల ఒక మాజీ పోలీసు అధికారి చెప్పిన మాట. నేరారోపణకూ నిరూపణకు మధ్య ఆధారాలు ముఖ్యపాత్ర వహిస్తాయని అవి లేకపోతే దర్యాప్తు బృందాలు చేయగలిగింది లేదని ఆయన స్పష్టం చేశారు. రక్త పరీక్షలు, తలవెంట్రుకల వంటివి కూడా అన్ని కేసుల్లోనూ ఒకే విధమైన ఫలితాలివ్వవని, కొన్ని రకాల మత్తుపదార్థాలు వాడితే దీర్ఘకాలం ప్రభావం వుండదని కూడా చెప్పారు. పైగా రాజకీయంగా ఈ కేసులో ఇక సంచలనాల పర్వం ముగిసినట్టేనని నేను అనడంతో ఆయన ఏకీభవించారు. అసలు దర్యాప్తు దగ్గర బుధవారానికి గురువారానికి మీడియా సందడిలో చాలా తేడా వచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన రివ్యూ వాస్తవానికి ఒక రీవ్యూ లాటిదేనని చెప్పాలి. తర్వాత కొత్తగా బయిటకు వచ్చిన విషయం ఒక్కటి కూడా లేదు. ఈ విషయంలో హడావుడి ఎక్కువగా చేస్తున్నారని మీడియాపై విమర్శలు చేస్తున్నారు దాంట్లో నిజం కూడా కొంత వుంది. అయితే మామూలు రోజుల్లో ప్రచార కెరటాలపై తేలియాడే టాలివుడ్‌ ప్రముఖులు కథ అడ్డం తిరిగినప్పుడు కూడా వ్యతిరేక ప్రచారం అందులో సగమైనా వుంటుందని వూహించాలి కదా.. పైగా సిట్‌ అధికారులు కోరుకోకపోతే ఇంత హడావుడి వుండదు. హై ప్రొఫైల్‌ కేసులు చేసేప్పుడు వారు కూడా ప్రచారం కోరుకుంటారు. ప్రభుత్వాధినేతలు కూడా పరిస్థితి చేయిదాటిపోకుండా చూసుకుంటూనే ఏదో జరిగిందన్న భావన కలిగించడానికి ప్రాధాన్యత నిస్తారు. ఇవన్నీ ఎలా వున్నా బలమైన ఆధారాలు దొరికితే కదా.. జరిగిన దానికి సార్థకత! చూస్తుంటే కథ యాంటీ క్లైమాక్స్‌గా ముగిసేట్టు వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close