జనసేనలో యువరక్తం ఏది..? వలస నేతలకే ప్రాధాన్యతా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా హైదరాబాద్ లో వరుసగా పార్టీలో నేతల్ని చేర్చుకుంటున్నారు. అందులో ముమ్మిడి వరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు టిక్కెట్ కూడా ప్రకటించారు. జనసేన అధినేత చేరికల విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. వరుసగా పార్టీలో నేతలు చేరుతూంటే సంతోషంగానే ఉంటుంది కానీ.. వచ్చే నేతలంతా… అటు తెలుగుదేశం పార్టీలోనో.. ఇటు వైసీపీలోనే టిక్కెట్ దొరికే చాన్స్ లేని వాళ్లే. టిక్కెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని తెలుసుకన్న తర్వాతే వారంతా జనసేన వైపు చూస్తున్నారు. కనీసం.. రేసులో ఉన్నట్లుగా ఉన్నా.. ఎవరూ జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి నేతలను కూడా పవన్ పార్టీలో చేర్చుకుంటున్నారు.

అదే సమయంలో పవన్ కల్యాణ్ గతంలో వలస నేతలు అసలు వద్దే వద్దంటూ … చేసిన ప్రకటనలను మరికొందరు గుర్తు చేస్తున్నారు. రాజకీయ జీవితం కోసం తన పార్టీలో చేరే వారికి అవకాశం ఇవ్వనని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వలస నేతలతోనే పార్టీని నింపేస్తున్నారు. పార్టీ తరపున టిక్కెట్ కూడా.. వలస నేతకే ప్రకటించారు. పైగా ఇప్పుడు చేరుతున్న నేతలంతా..ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే. ఇతర జిల్లాల నుంచి చేరుతామని వస్తున్న వారు కూడా ఎవరూ లేరు. తనకు యువ నేతలు కావాలని… బుల్లెట్లకు గుండెను అడ్డుపెట్టే యువతకు ప్రాధాన్యం ఇస్తానని పవన్ పదే పదే చెబుతూంటారు. అందు కోసం … జిల్లాల వారీగా ఎంపిక శిబిరాలు నిర్వహించారు. ఎంపికైన వారందరికీ ట్రైనింగ్ ఇచ్చి… వాళ్ల నుంచే నేతల్ని తయారు చేస్తామని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ప్రస్తతం జరుగుతోంది.

రాజకీయ వ్యూహాు, చేరికల విషయంలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్, వైసీపీల బటలోనే నడుస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ చెప్పే సరికొత్త రాజకీయానికి.. ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయానికి సంబంధం లేదన్న విమర్శలూ వస్తున్నాయి ఈ విషయంలో పవన్ కల్యాణ్ తన ప్రత్యేకత చూపకపోతే… ..ఇప్పటి వరకూ జనసేన సిద్దాంతాలకు ఆకర్షితులైన ఓ వర్గం యువత.. దూరమయ్యే ప్రమాదం ఉందనే అంచనాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close