జగన్ చేస్తున్న “ముందస్తు ఎన్నికల” ప్రచారం లోగుట్టేమిటి..?

ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో ముందస్తు ఎన్నికలొస్తాయని వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు బీజేపీ నేతలు చంద్రబాబుకు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా అని సవాళ్లు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి దగ్గరగా ఉండే మీడియా చంద్రబాబు … తెలంగాణతో పాటు.. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని ప్రచారం ప్రారంభించేసింది. ఇవన్నీ ఒకదానికొకటి సంబందం లేనట్లుగా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ నేతలు… మాత్రం తెర వెనుక రాజకీయం ఉందని నమ్ముతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రశ్నే లేదని.. టీడీపీ నేతలందరూ పదే పదే చెబుతున్నారు. మంత్రి లోకేష్ కూడా ఇదే విషయాన్ని … విజయవాడలో జరిగిన హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ ప్రారంభోత్సవంలోనూ స్పష్టం చేశారు. మరి వైసీపీ అధినేత ఎందుకు అంత విస్తృతంగా జనవరిలో ఎన్నికలని ప్రచారం చేస్తున్నారు..?

దీని వెనుక ఉన్న అసలు కారణం… జగన్ పాదయాత్రనేంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్లూ పూర్తవగానే పాదయాత్ర విరమించాలనే ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఇంకా నలభై కిలోమీటర్లు నడక పూర్తి చేస్తే.. 3వేల కి.మీ పాదయాత్ర పూర్తయిపోతుంది. ఇడుపుల పాయ నుంచి పాదయాత్ర ప్రారంభించినప్పుడు… ఇచ్చాపురం వరకూ.. ఆరు నెలలు, మూడు వేల కిలోమీటర్లు నడుస్తానని ప్రకటించారు. ఇచ్చాపురం వరకూ వెళ్లాలంటే మరో రెండు నెలల వరకూ పట్టే అవకాశం ఉంది. కానీ జగన్ 3వేల కి.మీతో పాదయాత్ర ముగించాలనుకుంటున్నారు. దానికి కారణంగా ఆయన ముందస్తు ఎన్నికలనే చూపించాలని అనుకుంటున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఎన్నికలొస్తాయని ప్రచారం చేస్తే… ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు .. పాదయాత్రను విశాఖలోే నిలిపివేసినట్లు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎలాగూ… పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను… బస్సుయాత్ర ద్వారా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇచ్చాపురం నుంచే ఆ బస్సుయాత్ర ప్రారంభిస్తే.. పాదయాత్ర చేయాలేదనే భావన రాకుండా ఉంటుందనే ఆలోచన వైసీపీ పెద్దలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి జగన్ ముందస్తునఎన్నికల ప్రచారం.. పాదయాత్ర ఆపేయడానికి ఓ కారణం వెదుక్కోవడానికేనన్న ప్రచారం కాస్త గట్టిగానే సాగుతోంది. దీనికి కారణం… ముందస్తుకు వెళ్లే విషయంలో ఏపీ ప్రభుత్వం కానీ.. టీడీపీ కానీ ఎలాంటి సన్నాహాలు చేస్తున్న సూచనలు కనబడకపోవడమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close