వైసీపీని టెన్షన్ పెడుతున్న ఒంగోలు ఎంపీ..!

వైసీపీలో ఎంపీలు అందరూ అప్పుడప్పుడూ మీడియా ముందు హాజరు వేయించుకుంటూ ఉంటారు కానీ… ఒంగోలు ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు టీడీపీ టిక్కెట్ ఇచ్చినా… వైసీపీ ఒత్తిడితో ఆ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి … ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చివరికి స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం పరిషత్ పోలింగ్ జరుగుతున్నా.. ఆయన ఎవరితోనూ టచ్‌లో లేరు. అసలు ఆయన ఏపీలో ఉంటున్నదే తక్కువని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన చెన్నైలోనే చాలా కాలంగా ఉంటున్నారు.

పార్టీ అధినేత ఎంపీలు ఎవరూ ఫోకస్ కావడానికి అంగీకరించరు. ఈ కారణంగా ఆయనను మొదట్లోనే నియంత్రించారు. చివరికి ..ఎంపీగా పార్టీలో కూడా ప్రాధాన్యత లేకుండా చేశారు. ఏ కార్యక్రమాలనైనా… జగన్ దగ్గరి బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి… వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగానే నడిచిపోతూంటాయి. సుబ్బారెడ్డి కన్ను.. ఎప్పుడూ.. ఎంపీ సీటు మీదనే ఉంటుంది. అవసరానికి… మాగుంటను పిలిపించి టిక్కెట్ ఇచ్చారు కానీ… రేపు అవసరం లేకపోతే.. పక్కన పెట్టేస్తారు. ఈ అంశాలన్నీ తెలుసు కాబట్టే మాగుంట సైలెంటయిపోయారు. గతంలో ఎంపీగా ఉంటే… వారానికి మూడు, నాలుగు రోజులైనా నియోజకవర్గంలో పర్యటించేవారు.

పార్టీలో ప్రాధాన్యత మాత్రమే కాదు.. ఏపీలో లిక్కర్ వ్యాపారాన్ని జగన్ దెబ్బతీయడం… పాత బకాయిలు ఏమీ చెల్లించకపోవడం కూడా.. మాగుంట ఆసంతృప్తికి మరో కారణం అంటున్నారు. మాగుంటకు బేవరేజెస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రఖ్యాత బ్రాండ్ల మద్యం ఉత్పత్తి చేస్తూంటారు. వీటి అమ్మకాలను ఏపీలో చేయడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో సరఫరా చేసిన వాటికి చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ రెండూ కూడా.. చేయడం లేదు. దీంతో మాగుంట.. జగన్ వ్యూహాత్మకంగా తన వ్యాపారాన్ని కూడా దెబ్బకొడుతున్నారని భావించి.. ఆయన చెన్నైలో ఉండి వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెబుతున్నారు.ఆయన రఘురామలాగా రెబల్ కాకుండా సాత్వికుడు కాబట్టి… అలాగే రాజకీయం చేస్తున్నారని.. లేకపోతే జగన్‌కు ఇబ్బందయ్యేదన్న చర్చ వైసీపీలో సాగుతోంది .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close