తెలంగాణా బంద్

తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, వామపక్షాలు ఇవాళ్ళ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. 15 నెలలు గడిచినా ఇంతవరకు పంట రుణాలను మాఫీ చేయకపోవడంతో తెలంగాణాలో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకొంటున్నారు కనుక ఇకనయినా ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయమని తెరాస ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందుకోసం రూ.8,500 కోట్లు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరాయి. కానీ ఒకేసారి అంత మొత్తం విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ్ళ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. శాసనసభ నుంచి ప్రతిపక్షాలను సస్పెండ్ చేసిన వెంటనే రాష్ట్ర బంద్ చేయబోతున్నట్లు ప్రకటించి అన్ని పార్టీల నేతలు జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజలను కలిసి ప్రభుత్వ తీరు గురించి వివరిస్తున్నారు. కనుక బంద్ కోసం అన్ని పార్టీలు ముందు నుంచే పూర్తి సమాయత్తం అయ్యాయి. ఇవాళ్ళ తెల్లవారు జాము నుంచే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటకి రానీయకుండా అడ్డుకొంటున్నారు.

ప్రతిపక్షాలు బంద్ కి పిలుపునీయడంపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ ఇన్ని దశాబ్దాలుగా తెలంగాణాని దోచుకుతిని రైతులకు ఈ గతి పట్టించినవాళ్ళే ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతూ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేసారు. తమ పార్టీ అధికారం చేపట్టి కేవలం 15 నెలలు మాత్రమే అయినపటికీ రైతుల పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టిందని వాటి ఫలితాలు క్రమంగా కనబడతాయని అన్నారు. కనుక ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మి బంద్ కు సహకరించవద్దని ఆయన ప్రజలను కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close