పవన్, బీజేపీ ఏం చేయబోతున్నారు..!?

భారతీయ జనతా పార్టీ, జనసేన.. అమరావతి కోసం.. ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. పవన్ కల్యాణ్.. ఈ విషయంలో మరింత సీరియస్‌గా ఉన్నారు. అమరావతి తరలింపు నిర్ణయం.. తాత్కాలికమేనని.. పవన్ కల్యాణ్ ఘంటాపథంగా చెబుతున్నారు. మళ్లీ శాశ్వత పాలనా రాజధానిగా అమరావతి ఉంటుందని అంటున్నారు. సోమవారం అత్యవసరంగా.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిపిన పవన్ కల్యాణ్… అసెంబ్లీలో చర్చలు జరిగిన తీరు.. బయట ఆందోళనల అంశాన్ని చర్చించారు. వైసీపీకి విశాఖపై ప్రేమలేదుని ..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖ రాజధాని అంటున్నారని పవన్ మండిపడ్డారు.

టీడీపీ చేసిన తప్పులే వైసీపీ చేస్తోందని .. అమరావతిని తరలించడం సాధ్యం కాదని తేల్చారు. 5 కోట్ల మంది ఆమోదించిన తర్వాత ఇప్పుడు రాజధాని తరలింపు ఏంటని అంటున్నారు. ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్‌ పడగలు విప్పేలే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పుతో జగన్‌ తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడని తేల్చారు. ఏపీలో పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని జాతీయస్థాయిలో బలమైన మార్పులు జరగబోతున్నాయన్నారు. మరో జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా.. అమరావతి విషయంలో కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని అంటున్నారు.

కచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని తుగ్లక్ నిర్ణయాల కారణంగా.. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోకుండా.. కేంద్రం జోక్యం చేసుకుంటుందని అంటున్నారు. రాజధాని మార్పు విషయంలో.. నోటిఫికేషన్ జారీకో.. మరో దానికో.. ఖచ్చితంగా.. కేంద్రానికి లేఖ రాయాల్సి ఉటుందని.. అలా రాసిన తర్వాత ఏం జరుగుతుందో.. చూస్తారని ఆయన అంటున్నారు. జనసేన, బీజేపీ కలిసి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ కూడా ఖరారు చేసుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close