తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి: పవన్

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వాకం మీద రాజకీయ పార్టీలు ఇప్పటికే స్పందించిన విషయం, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ జనసేన పార్టీలు కూడా నిరసన కార్యక్రమాలు చేశాయి. పవన్ కళ్యాణ్ ఈ సమస్య మీద స్పందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం –

” తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చడం దారుణం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు దగ్గర నుండి ఫలితాలు విడుదల వరకు ప్రతి అంశం మీద విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసి ఈ నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థుల మీద వారి తల్లిదండ్రుల మీద ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుదాడికి దిగడం ఖండిస్తున్నాను. విద్యార్థులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయించాలి. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా పరిహారం ఇప్పించాలి. ఇన్ని అవక తవకలకు ఇన్ని అనర్థాలకు కారణం అయిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల మీద, సాఫ్ట్వేర్ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా న్యాయవిచారణకు ఆదేశించాలని ” అంటూ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థుల తరపున జనసేన పోరాటం చేస్తుందని, విద్యార్థులు ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోరాదని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

తెలంగాణ విద్యార్థుల సమస్య మీద వైఎస్సార్సీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు ఇంకా స్పందించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close