ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలు : పవన్ కల్యాణ్

ఏపీలో అసెంబ్లీని రద్దు చేయకపోయినా జరుగుతున్నా ..ఎన్నికల సన్నాహాలు జరుగుతున్న తీరుతో తెలంగాణతో పాటు డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకానికి రాజకీయ పార్టీలు వస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ నేతలకు అదే చెప్పారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో ఇది ఎన్నికల సంవత్సరంలా కనిపిస్తోంది, ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల సంకేతాలను పార్టీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలని నడుచుకోవాలన్నారు.

నా చుట్టూ తిరిగితే నాయకులు కాలేరు. ఏరోజూ కూడా సీట్ల కోసం ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదని జనసేనాని స్పష్టం చేశారు. ఒకవేశ సీటు కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే ఇది మీ తప్పిదమే అని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఇటీవల ఒకరు తన మనిషి అని చెప్పి, పవన్ తో ఫోటో తీయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇలాంటివి ప్రోత్సహించకూడదని, వీటిని మొగ్గ దశలోనే తుంచివేయడం మంచిదన్నారు.సీఎం జగన్ పాలన ఎలా ఉందంటే.. రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడం అనేలా ఉందన్నారు. రాజకీయం అంటే బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. జగన్ అనే అరాచకశక్తిపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

న్యాయమార్గంలో ఎవరూ ఉండకూడదు, ఒకవేళ న్యాయంగా డబ్బు సంపాదించినా జనాలు మాట్లాడకూడదు, కామ్ గా కూర్చోవాలి అనే తీరుగా సీఎం జగన్ పాలన ఉందని విమర్శించారు. గతంలో రాజకీయాలపై ఏదో మూల ప్రజల్లో భయం ఉన్నా, ఇప్పుడు వైసీపీ దాన్ని పరిపూర్ణం చేసిందంటూ సెటైర్లు వేశారు. తనకు అపారమైన జనాధరణ ఉందని, తెలంగాణలోనూ పార్టీ నడుపుతున్నాం కానీ అక్కడ ఇబ్బంది కలగలేదన్నారు. కానీ ఏపీలోనే జనసేనను ఎదుర్కొనేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదన్నారు. త్యాగం, బాధ్యత, విలువలు, జవాబుదారీతనం ఉన్నవారి వెంట ప్రజలు నడుస్తారని పవన్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close