ఫేక్ న్యూస్ ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్, రజనీకాంత్ ..!?

సూపర్ స్టార్లు రజనీకాంత్, పవన్ కల్యాణ్ చేసిన రెండు ట్వీట్లను .. ట్విట్టర్ తొలగించింది. సూపర్‌ స్టార్లు చేసిన ట్వీట్లను తొలగించడం అంటే.. ఓ రకంగా.. అదో సంచలనమే. సాధారణంగా ట్వీట్లను ట్విట్టర్ తొలగించదు. ముఖ్యంగా.. వెరీఫైడ్ అకౌంట్ల నుంచి చేసిన ట్వీట్లను తొలగించదు. కానీ ఈ ఇద్దరి ట్వీట్లను.. అదీ కూడా.. ప్రజలకు అవేర్ నెస్ కలిగించేందుకు ప్రజల్ని.. కరోనాపై పోరాటానికి సంకల్పించేందుకు చేసిన ట్వీట్లను తొలగించడం.. కలకలం రేపింది. అయితే.. దీనికి ట్విట్టర్ సరైన కారణం చెప్పింది. అది.. రజనీకాంత్, పవన్ కల్యాణ్ ఇద్దరూ.. ఫేక్ న్యూస్‌ను ట్వీట్ చేయడమేనని తేల్చింది. వీరిద్దరూ చేసిన ఫేక్ న్యూస్ ట్వీట్ కరోనా గురించే.. అదీ కూడా… జనతా కర్ఫ్యూ గురించే.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకి … అందరూ మద్దతు పలికారు. సెలబ్రిటీలు అందరూ.. తమ తమ స్టైల్లో.. అభిమానులకు పిలుపునిచ్చారు. అలా..రజనీకాంత్, పవన్ కల్యాణ్ కూడా పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ పాటిద్దామని.. చెప్పి ఉంటే సరిపోయేది కానీ.. వీరు.. మరో ఉపదేశం కూడా ఇచ్చారు. తమ ట్వీట్లలో.. జనతా కర్ఫ్యూ వల్ల ఎలా కరోనాను జయించవచ్చో వివరించారు. పధ్నాలుగు గంటల కర్ఫ్యూ పాటించడం వల్ల.. వైరస్ చచ్చిపోతుందని చెప్పుకొచ్చారు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలేనని.. పధ్నాలుగు గంటలు జనతా కర్ఫ్యూ పాటించడం వల్ల.. ఆ వైరస్ చచ్చిపోతుందని.. అందుకే కర్ఫ్యూ పాటించాలని పిలపునిచ్చారు. కానీ.. అదంతా ఫేక్ ప్రచారం అని.. ట్విట్టర్ తేల్చేసింది. అందుకే.. ఆ ట్వీట్లను డిలీట్ చేసింది.

సోషల్ మీడియాలో కరోనాపై సాగుతున్న ఫేక్ ప్రచారాలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎవరి స్థాయిలో వారు.. మందును కనుగొని..దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించని సమాచారాన్ని కూడా సెలబ్రిటీలు పోస్టు చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో మరింత గందరగోళం పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సలెబ్రిటీల ట్వీట్లను ట్విట్టర్ టార్గెట్ చేసిటన్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close