ఐనా..డోంట్ కేర్..! పోలవరానికి రివర్స్ టెండర్లేనంటున్న సర్కార్…!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పోలవరం రీటెండర్ల విషయంలో… హైకోర్టు ఆదేశాలను… కేంద్రం సూచనలను కూడా… లైట్ తీసుకోవాలని అనుకుంటున్నారా … అంటే.. అవుననే పరిస్థితులు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కేంద్ర పెద్దలతో భేటీ కోసం.. ఢిల్లీ వెళ్లిన జగన్ …. ఆయనతో పాటు వెళ్లిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…పోలవరంపై తమ విధానాన్ని.. నేరుగానే చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మణాన్ని .. రీటెండర్ల ద్వారానే కొనసాగిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే రీటెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రివర్స్ టెండర్ల విషయంలో అడుగు ముందుకు వేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి.. ఏపీ సర్కార్… కేవలం విద్యుత్ ప్రాజెక్టు గురించి మాత్రమే.. సర్కార్ ఆదేశాలిచ్చిందని వాదిస్తోంది.

అయితే.. ఏపీ సర్కార్.. అటు పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులకు.. విద్యుత్ కేంద్రానికి కలిపి రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. అంటే… రివర్స్ టెండర్లను మొత్తం నిలిపివేసినట్లే అవుతుందని.. న్యాయనిపుణుల అంచనా. అంతకు మించి… కేంద్ర ప్రభుత్వం కూడా..రివర్స్ టెండర్ల విషయంలో అసంతృప్తిగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చాలా స్పష్టంగా… నివేదిక ఇచ్చింది. రివర్స్ టెండర్లకు వెళ్తే.. అటు ధనం.. ఇటు సమయం వృధా అవుతుందని తేల్చేసింది. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ… పలువురితో ఈ విషయాలపై మాట్లాడతారని..కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే… అలాంటి భేటీ జరగకుండానే.. మంత్రి పెద్దిరెడ్డి..రివర్స్ టెండర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రకటించేశారు. అంటే.. ఏపీ సర్కార్ విధానం ఇదే అనుకోవాలి. హైకోర్టులో డివిజన్ బెంచ్ కు వెళ్లడమో…కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవడమో.. చేసి..తాము వెనక్కి తగ్గకుండా… రివర్స్ ప్రక్రియను స్ట్రెయిట్ గా తీసుకెళ్లాలని… ఏపీ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close