కనిపెట్టేశారు…ఎమ్మెల్సీ డ్రైవర్‌ది హత్యేనట !

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి హత్యేనని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. మెడికల్ రిపోర్టులో ఆయనను కొట్టి చంపినట్లుగా తేలిందని దాంతో హత్య కేసుగా నిర్దారించి… ఏ వన్‌గా అనంతబాబును చేర్చి హత్య కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సుబ్రహ్మణ్యం విషయంలో ఎవరికైనా అది హత్యేనని ప్రాథమికంగా అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం హతుని భార్య.. ఇతర విపక్షాలు రెండు, మూడు రోజుల పాటు అట్టుడికేలా ఆందోళనలు చేస్తే తప్ప.. అనుమానాస్పద కేసును హత్యగా మార్చేందుకు పోలీసులు సిద్ధం కాలేకపోయారు.

ఇలాంటి ఘటన జరిగితే ముందుగా ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకోవాలి. కానీ ఆయన మాత్రం దర్జాగా పెళ్లిళ్లకు… తిరుగుతూనే ఉన్నారు. తీరా పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చే సరికి ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారనిప ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నామని చెప్పుకొస్తున్నారు. ప్రమాదం జరిగిందని.. మరొకటని ఎమ్మెల్సీ అబద్దాలు చెప్పడమే కాకుండా .. నోరు తెరవ వద్దని కుటుంబసభ్యుల్ని బెదిరిస్తున్నప్పటికీ… ఎమ్మెల్సీని అరెస్ట్ చేయలేదని ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారని విపక్షాలు మండి పడుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టే చట్టం ఆయనకు చుట్టంలా మార్చేశారన్న ఆరోపణలు పోలీసులపై తీవ్రంగా వస్తున్నాయి. చివరికి నిందితుడ్ని అరెస్ట్ చేసే విషయంలోనూ అదే పరిస్థితి. చనిపోయిన సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. ఆర్థిక సాయం అందిస్తామని ప్రజాప్రతినిధులు హమీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది . హత్య కేసుగా నమోదు చేయక తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. చర్చలు ఎలా తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

ఓటేస్తున్నారా ? : క్రిమినల్ ఎప్పుడూ హీరో కాదని గుర్తుంచుకోండి !

" ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close