బీజేపీలోకి వెళ్తానని కేసీఆర్‌ను బెదిరిస్తున్న పొంగులేటి!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయించలేదు. ఈ విషయం ఆధారాలతో సహా కేసీఆర్‌కు అందించారు ఖమ్మం నేతలు. దీంతో చర్యలు తీసుకోవడం ఖాయమని.. కేసీఆర్ గతంలోనే హెచ్చరించారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీన్ అర్థమైపోయింది. తనకు ఇక ఎమ్మెల్సీ, రాజ్యసభే కాదు.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ టిక్కెట్లు దక్కవని అర్థమైపోయింది.

అయితే ఆయన ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లాలని అనుకోవడం లేదు. బయటకు వెళ్తున్నా అనే ఫీలర్స్ పంపి అయినా సరే ఏదో ఓ హామీ పొందాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీలోకి వెళ్తున్నానని.. తన కోసం ఏపీ సీఎం జగన్ బీజేపీ నాయకత్వంతో మాట్లాడారని ఆయన తెలంగాణకు చెందిన కొన్ని మీడియాలకు సమాచారం లీక్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఎక్కువ మంది నమ్మడం లేదు.

ఆయన గతంలో కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. తర్వాత బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా వినిపించింది. కానీ టీఆర్ఎస్‌లో తప్ప ఎక్కడా రాజకీయం వర్కవుట్ కాదని ఆగిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఏదో ఓ చోట టిక్కెట్ హామీ ఇస్తే ఆయన ఉండటానికి సిద్ధమే. కానీ టీఆర్ఎస్‌లో అంత స్పేస్ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో లేదు. అందుకే చివరికి ఆయన ఏదో ఓ పార్టీ చూసుకుని వెళ్లిపోవాల్సిందేనని.. ఆయనను బుజ్జగించడం కూడా వేస్ట్ అని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close