యూటర్న్..! పీపీఏలను రద్దు చేయబోమంటున్న ఏపీ..!

పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో.. నిండా మునిగిపోయాక.. ఇప్పుడు.. బయటకు ఎలా తేలాలా.. అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా…. పీపీఏలను రద్దు చేయబోవడం లేదనే ఓ ప్రకటనను.. జాతీయ మీడియాకు.. ఏపీ సర్కార్ పంపింది. ముఖ్యంగా.. బీజినెస్ వెబ్ సైట్లు.. ఇతర వ్యాపార పరమైన వార్తలు కవర్ చేసే మీడియా సంస్థలకు.. ఆ వివరణను పంపి.. ప్రముఖంగా.. వార్త వచ్చేలా చూడాలని.. సర్కార్ పెద్దలు కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.

పీపీఏను సమీక్షల కమిటీ రద్దు చేయదన్న ఏపీ సర్కార్..!

ఏపీ సర్కార్… జాతీయ మీడియాకు పంపిన సమాచారం ప్రకారం… పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను.. రద్దు చేసే ఉద్దేశంతో.. తాము నియమించిన సమీక్షల కమిటీకి లేదని… ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం కంపెనీలతో సంప్రదింపులు మాత్రమే జరుపుతుందని చెప్పుకొచ్చింది. కానీ.. హైకోర్టు సస్పెండ్ చేసిన జీవో ప్రకారం.. విద్యుత్ రంగంలోని పీపీఏలన్నింటినీ.. సమీక్షించి.. ఎక్కువగా చెల్లించినట్లు భావిస్తున్న నిధులను రికవరీ చేయాలని.. లేకపోతే.. పీపీఏలను రద్దు చేయాలని.. ఆ కమిటీకి అధికారం ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధమని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. విద్యుత్ కంపెనీలు పవర్ ట్రిబ్యునల్‌కు వెళ్లాయి. కోర్టులోనూ పిటిషన్లు వేశాయి. అదే సమయంలో.. కేంద్రానికీ ఫిర్యాదులు చేశాయి.

నిండా మునిగిన తర్వాత బయట పడే ప్రయత్నమా..?

ధరలు తగ్గించమని.. బెదిరిస్తున్నారని… విద్యుత్ కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడం… వ్యాపారవర్గాల్లో కలకలం రేపుతోంది. చివరికి ఈ జీవోను… హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత కూడా.. ఇమేజ్ డామేజ్ అయ్యే నిర్ణయమే వస్తుంది కానీ.. పీపీఏలపై సమీక్ష.. ఏ విధంగానూ చట్టబద్ధం కాదని న్యాయనిపుణుల అభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా.. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. కేంద్రం రెండు సార్లు లేఖలు రాసి హెచ్చరించినంత పని చేసింది. అయినా… ధరలు తగ్గించకపోతే పీపీఏలను రద్దు చేస్తామనే హెచ్చరికలను ఏ మాత్రం ఆపని… సమీక్షా కమిటీ… ఒక్క సారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. హైకోర్టు కమిటీ జీవోను.. సమీక్షలకు రావాలనే ఆదేశాల లేఖలను కూడా సస్పెండ్ చేయడంతో.. ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించకపోతే.. మొదటికే మోసం వస్తుందని.. ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తున్నారని.. అందుకే పీపీఏలను రద్దు చేసే ఉద్దేశమే లేదని.. జాతీయ మీడియాకు సమాచారం పంపుతున్నారని చెబుతున్నారు.

ఈఆర్సీ గురించి ఏపీ సర్కార్‌కు ఇప్పుడే తెలిసిందా..?

అయితే.. తాము పీపీఏలను రద్దు చేయబోం కానీ… తమ వాదనను.. ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ టారిఫ్‌లు మొత్తం ఈఆర్సీ చేతుల్లో ఉంటాయని తెలియకుండానే.. ఏపీ సర్కార్.. ఇంత వరకూ ఎలా నిర్ణయాలు తీసుకుందన్న చర్చ.. ఇప్పుడు.. విద్యుత్ రంగ నిపుణుల్లో ప్రారంభమైంది. ఏది ఏమైనా… పీపీఏల వివాదంలో ఇరుక్కుపోయిన … వైసీపీ బయటకు వచ్చేందుకు ..గడ్డిపోచను పట్టుకుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close