ప్ర‌భాస్ 25.. ఎవ‌రితో?

ప్ర‌భాస్.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ స్టార్‌! ప్ర‌భాస్ కాల్షీట్లు ఇస్తానంటే – మూడేళ్ల త‌ర‌వాతైనా సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు రెడీ. ఇప్ప‌టికే.. ప్ర‌భాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. `రాధే శ్యామ్` పూర్తికావొచ్చింది. ఆ వెంట‌నే… `ఆదిపురుష్‌`, `స‌లార్‌` వ‌స్తాయి. మ‌రోవైపు నాగ అశ్విన్ కాచుకుని కూర్చున్నాడు. నాగ అశ్విన్ సినిమా ప్ర‌భాస్ కెరీల్ 23వ చిత్రం. 24వ సినిమాకి కూడా ద‌ర్శ‌కుడు ఆల్రెడీ ఫిక్స‌యిపోయాడ‌ట‌. ఆ వివ‌రాలు గోప్యంగా ఉంచింది ప్ర‌భాస్ టీమ్‌. దాంతో పాటు ప్ర‌భాస్ 25వ సినిమా కూడా ఓకే అయిపోయింద‌ని, ఈచిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించ‌బోతోంద‌ని టాక్‌.

మ‌రో విశేషం ఏమిటంటే.. కొర‌టాల శివ‌తో ప్ర‌భాస్ 25వ సినిమా ఉండ‌బోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్ వినిపిస్తోంది. `మిర్చి`తో… కొర‌టాల శివ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో కొర‌టాల జాత‌క‌మే మారిపోయింది. అప్ప‌టి నుంచీ ప్ర‌భాస్ తో మ‌రో సినిమా చేయాల‌ని అనుకుంటూనే ఉన్నాడు. కానీ అటు ప్ర‌భాస్‌, ఇటు కొర‌టాల ఇద్ద‌రూ బిజీగా ఉండ‌డంతో… కుద‌ర‌డం లేదు. కాక‌పోతే.. ప్ర‌భాస్ 25వ సినిమా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొర‌టాల‌తో చేయాల‌ని మైత్రీ గ‌ట్టిగా డిసైడ్ అయ్యింద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ కూడా ఈ మైల్ స్టోన్ సినిమా బాధ్య‌త‌ని కొర‌టాల‌కు అప్ప‌గించ‌డానికి సిద్ధంగానే ఉన్నాడ‌ట‌. కాక‌పోతే… ప్ర‌భాస్ 25వ సినిమా అంటే.. మూడేళ్ల త‌ర‌వాతి మాట‌. అప్ప‌టికి రాజెవ‌రో, మంత్రెవ‌రో?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close