డూ ఆర్ డై సిట్యువేషన్ లో వున్నాడు రామ్ చరణ్. మిగిలిన హీరోలంతా హిట్లమీద హిట్లు కొట్టుకుంటూ దూసుకుపోతున్నారు. చరణ్ కెరియర్ మాత్రం దిగాలుగా సాగుతొంది. ధృవ పైనే ఆశలు పెట్టుకున్నాడు. దసరాకి రావాల్సిన ధృవ డిసెంబర్ కి వాయిదా పడింది. మధ్యలో రెండు నెలలు సమయం ఉంది. నిదానంగా షూటింగ్ చేసుకున్నా ఆ సమయానికి సినిమా పూర్తి చెయ్యొచ్చు. కాని చరణ్ మాత్రం తొందర పెడుతున్నాడట. అక్టోబర్ చివరికల్లా సినిమా పూర్తి అవ్వాలని, నవంబర్ 15 నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలని డెడ్ లైన్ విధించాడట. కావాల్సినంత సమయం చేతిలో ఉంటే మార్పులూ చేర్పులూ చేసుకునే వీలు ఉంటుందని, ఆఖరి నిమిషం వరకూ సినిమాని చేతిలోనే ఉంచుకుంటే హడావుడి తో తప్పులు చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నాడట.
ఓవర్సీస్ లో చరణ్ మార్కెట్ అంతంత మాత్రమే. అందుకే ఈ సారి ఓవర్సీస్ లో ప్రమోషన్లపై ఫోకస్ చెయ్యాలని చూస్తున్నాడట. కేవలం ప్రమోషన్ల కోసమే ఓ టీం ని నియమించినట్టు తెలుస్తోంది. చిరు సినిమా ఖైదీ నెం 150 కీ ఇదే టీమ్ పనిచెయ్యబోతొందని టాక్. ట్రైలర్, పోస్టర్, టీజర్ ఏదైనా సరే సపరేట్ మార్క్ తో వుండాలని, ప్రమోషన్లను అంచెలంచెలుగా పెంచాలని చరణ్ భావిస్తున్నాడట. బ్రూస్లీ దెబ్బకు డీలా పడిన చరణ్ కెరియర్ ధృవ ఫలితం పైనే ముడిపడివుంది. అందుకే ఇంత జాగ్రత్త పడుతున్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో ??