తేజ – సురేష్ బాబు… మ‌ధ్య‌లో స‌ముద్ర‌ఖ‌ని

సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సురేష్ బాబునే నిర్మాత‌. ఆయ‌నేమో… ప్ర‌తీ రూపాయి ఆచి తూచి ఖ‌ర్చు చేసే ర‌కం. తేజ‌దేమో.. ప‌ట్టువిడ‌వ‌ని వైఖ‌రి. దాంతో ఇద్ద‌రి మ‌ధ్యా అప్పుడే గ్యాప్ మొద‌లైంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాల‌ని తేజ భావించాడు. కృతితో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. కానీ కృతి మాత్రం కోటి రూపాయ‌ల పారితోషికం డిమాండ్ చేసింది. దాంతో సురేష్ బాబు వెనుకంజ వేశారు. `కృతి అయితే కోటి క‌దా… ఇంకొక‌ర్ని తీసుకుందాం` అని తేజ‌ని వెన‌క్కి లాగారు. ఈ విష‌యంలో సురేష్ బాబుతో తేజ కాంప్ర‌మైజ్ అయిపోయారు కూడా. ఇప్పుడు ఇలాంటి ఇష్యూనే మ‌రోటి నడుస్తోంది. ఇందులో కీల‌క‌మైన పాత్ర కోసం స‌ముద్ర‌ఖ‌ని పేరు రాసిపెట్టుకున్నాడు తేజ‌. స‌ముద్ర‌ఖ‌నితోనూ సంప్ర‌దింపులు జ‌రిపారు. ఆయ‌న కూడా ఈ సినిమాలో న‌టించ‌డానికి రెడీ. కాక‌పోతే.. మ‌ళ్లీ పారితోషికం ద‌గ్గ‌రే గొడ‌వ‌. స‌ముద్ర‌ఖ‌ని అడిగిన దానికి సురేష్ బాబు నో చెప్ప‌డంతో తేజ మ‌రో ఆప్ష‌న్ వెదుక్కోవాల్సివ‌స్తోంది. అడిగిన హీరోయిన్ని అయినా ఇవ్వ‌లేదు.. క‌నీసం స‌ముద్ర‌ఖ‌నినైనా ఓకే చెబితే బాగుంటుంద‌ని తేజ భావిస్తున్నాడు. కానీ సురేష్ బాబు కి మాత్రం బ‌డ్జెట్ పెరిగిపోతుంద‌ని భ‌యం. స‌ముద్ర‌ఖ‌ని విష‌యంలో మాత్రం తేజ వెనుకంజ వేయ‌డం లేద‌ని, ఈ విష‌యంలో ప‌ట్టుగా ఉన్నాడ‌ని, సురేష్ బాబుని ఒప్పించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని, అందుకే ఆ పాత్ర తాలుకూ సీన్స్ బాలెన్స్ పెడుతున్నాడ‌ని టాక్‌. మ‌రి సురేష్ బాబు ఏం చేస్తాడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close