కేసీఆర్‌కు రావాల్సిన ఈడీ నోటీసులు ఆగిపోయాయంటున్న రేవంత్ !

పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారు..? . ధాన్యం కొనుగోళ్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. మరి ఎందుకు విరమించారు..? ఎందుకు అసలు సభకే డుమ్మా కొట్టాలనుకున్నారు..? ఇది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు.. విరమణ వెనుక ఉన్నది ఈడీ నోటీసుల వ్యవహారమని అంటున్నారు. కేసీఆర్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కేంద్రం వద్ద ఆధారాలున్నాయని.. ఈడీ నోటీసులు పంపిస్తారని తెలిసిన తర్వాతే ఆయన ఎంపీలను ఆందోళనలకు రెచ్చగొట్టారని అంటున్నారు.

కేంద్రంతో ఓ ఒప్పందం చేసుకుని ఈడీ నోటీసులు రావు అనిక్లారిటీ తీసుకున్న తర్వాత ఎంపీల ఆందోళలను విరమింప చేశారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల పేరుతో బీజేపీ,కేసీఆర్ డ్రామాలాడారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలు అంత తేలిగ్గా తీసి పడేయాల్సినవి కావన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది. ఎందుకంటే .. కేసీఆర్ వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టడం ప్రారంభించినప్పటి నుండి ఆయన ఈడీ కేసుల గురించి మాట్లాడుతున్నారు. భయపడబోమని చెబుతున్నారు.

ఏమీ లేకపోతే.. కేసుల గురించి కేసీఆర్ ఎందుకు ఆందోళన చెందుతారని అంటున్నారు. నిలదీస్తామని ఢిల్లీకి వెళ్లి కొన్ని రహస్య సమావేశాలు పూర్తి చేసుకుని ఎందుకు తిరిగి వచ్చారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఢిల్లీలో ఎవరికీ తెలియని రాజకీయం జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close