క్యాడర్‌కు ప్రజాధనంతో జీతాలిచ్చేందుకు రేవంత్ కూడా స్కెచ్ !

జన్మభూమి కమిటీలు అయినా.. వాలంటీర్లు అయినా పేర్లే తేడా. అందరి పని పథకాల లబ్దిదారులను అధికార పార్టీకి ఓటు బ్యాంక్ గా మార్చడమే. ఇప్పుడు కొత్తగా సీఎం సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ కమిటీల ద్వారానే ప్రతి ఇంటికీ చేరనున్నాయని రేవంత్ ప్రకటించారు. ఏ పథకానికైనా లబ్ధిదారులను ఈ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారు.

ఈ కమిటీలన్నింటికీ.. ఉద్యోగ నియామకాల్లాంటివేమీ ఉండవు. నేరుగా కాంగ్రెస్ క్యాడర్ నే ఎంపిక చేస్తారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ. 6 వేల గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మందిని కమిటీల సభ్యుడిగా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల ద్వారా నియమించే వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు.

ఇలా చేయడం ప్రజా ధనాన్ని క్యాడర్ కు ఇవ్వడమే అవుతుంది. అయినా రాజకీయ పార్టీలకు ఇప్పుడు ప్రజాధనంతో పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలుచేయడమే కామన్ అయిపోయింది. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఎలాంటి జీతాలు చెల్లించేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వందలకోట్లు పార్టీ కార్యకర్తలకు వెచ్చించి.. ఓటర్లపై ఓ కన్నేసి ఉంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇలాంటివి ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అవుతున్నాయని తెలిసినా రాజకీయ పార్టీలు తగ్గకపోవడమే ఇక్కడ అసలు విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close