జగన్ కొట్టలేదు .. నమ్మండి!

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎవరికీ రాని కష్టం వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ఆయనను కొట్టారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన సమావేశానికి వెళ్లారని బయటకు వచ్చేటప్పుడు కళ్ల జోడు విరిగిపోయిందని చెప్పుకున్నారు. అది ఆ నోటా.. ఈ నోటా పడి చివరికి ఎమ్మెల్యే వద్దకే చేరింది. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే ఖండించకపోతే పరువు పోతుందని అనుకున్నారు. కానీ ప్రెస్‌మీట్ పెట్టి ఖండిస్తే రాజకీయం అయిపోతుంది.. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకుడి ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై ఎందుకు చేయి చేసుకుంటారని ప్రశ్నించారు.

కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కానీ ఖమ్మం జిల్లా పొరుగు రాష్ట్రం కావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆయన తెలుగు యువత నేత దొరకడం లేదు. ఎలాగోలా పట్టుకోవడానికి సీరియస్‌గా ట్రై చేస్తున్నారు. అయితే ఈ లోపు వసంత కృష్ణప్రసాద్‌కు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close