జగన్‌పై ఆ పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు..!

జగన్‌మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని.. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న ధర్మాసనం సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది చీఫ్ జస్టిస్ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని.. లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని ధర్మాసనం పేర్కొంది. జగ‌న్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణపై దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది…వేసిన మరో పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను మీడియా ముందు చేసి..న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని తగ్గించేందుకు విశ్వసనీయతను దెబ్బకొట్టేందుకు కుట్రపూరితంగా జగన్ వ్యవహరించినట్లుగా… పిటిషన్‌లో సింగ్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తన పరిధిని దాటారని అంటున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.

న్యాయమూర్తులపై..న్యాయవ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడికి పాల్పడుతోందని.. బెదిరించడానికి.. తప్పుడుప్రచారం చేయడానికే.. లేఖ రాశారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో… సుప్రీంకోర్టు రెండు పిటిషన్లను కొట్టి వేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇది వైసీపీ వర్గాలను సంతృప్తి పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close