దానం నాగేందర్ కూడా తెరాసలోకి జంప్?

రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందరూ దానిని ముందే ఊహించారు. కానీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని, తమ పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది. ఎన్నికలలో గెలుపోటములు సహజమేనని భావించవచ్చును. కానీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోలాగే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.రాష్ట్ర విభజనతో మూటగట్టుకొన్న ప్రజావ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనపడుతుంటే, తెలంగాణాలో అధికార తెరాస పార్టీ అమలుచేస్తున్న ‘ఆపరేషన్ ఆకర్ష’ కారణంగా కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతోంది.

తెరాస ఇవ్వజూపిన పదవికి ఆశపడి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో తనకున్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని త్రెంచుకొని రెండు నెలల క్రితం తెరాసలో చేరిపోయారు. ఆ తరువాత కె.జానారెడ్డి తెరాసలోకి జంప్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఆయన వెనకాడుతున్నారు. కానీ ఆయన కంటే ముందు దానం నాగేందర్ తెరాసలోకి వెళ్లిపోబోతున్నట్లు తాజా సమాచారం. దానంతో సత్సంబంధాలున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనను తెరాసలోకి రప్పించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డి.శ్రీనివాస్ లాగే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో సత్సంబంధాలున్న వ్యక్తే. అటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పేసి తెరాసలోకి వెళ్లిపోతుండటం ఆశ్చర్యకరం. కానీ దానం నాగేందర్ మాత్రం ఆ వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపడేశారు. అవి ఊహాగానాలో కావో త్వరలో ఆయనే తేల్చి చెపుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close