వైసీపీలోకి సోము వీర్రాజు..!?

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని సోము వీర్రాజు.. హఠాత్తుగా.. సీఎం జగన్ ఇంటికి వెళ్లి ఆయనతో గంటకుపైగా సమావేశం అయ్యారు. వైసీపీలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా.. అంగీకారం తెలిపారని అంటున్నారు. ఆ ఉత్సాహంతో.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. మద్దతుగా.. సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. జగన్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మొదటగా.. రాజధానిపైనే గురి పెట్టారు. రాజధానిపై చంద్రబాబు హైప్ క్రియేట్ చేశారని.. రూ.7వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు..ఏం కట్టారో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతటితో సరిపెట్టలేదు.. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇంగ్లిష్ మీడియం వ్యవహారంలో.. వైసీపీకే ఆయన సపోర్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం పెట్టడం మంచిదేనని తేల్చారు. అయితే బీజేపీ విధానం మాత్రం.. దానికి భిన్నంగా ఉంది. కన్నా లక్ష్మినారాయణ.. మతపరరమైన కోణంలోనే.. ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ లైన్ నే ఆయన ప్రకటిస్తారు. కానీ దానికి భిన్నంగా వైసీపీకి మద్దతు ప్రకటించారు సోము వీర్రాజు. పోలవరంలో అవినీతి గురించి.. ఇప్పుడు సోము వీర్రాజుకు పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. పోలవరం కంటే విద్య, వైద్యంలో అవినీతి ఎక్కువగా ఉందని దానిపై సీఎం దృష్టి సారించాలన్నారు. వైసీపీలో చేరడానికి నిర్ణయించుకునే.. ఇలా సొంత పార్టీనే ధిక్కరిస్తున్నారన్న అభిప్రాయం బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు.. ఒకప్పుడు.. ఏపీ బీజేపీలో తానే గొప్ప నేత అనుకునేవారు. ఆయన తప్ప మరో నేత లేరన్నట్లుగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీతో పొత్తు సమయంలో.. రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా.. ఆయన ఆకుల సత్యనారాయణకు ఇచ్చేశారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

అయినప్పటికీ.. సోము వీర్రాజు ఎప్పుడూ.. టీడీపీ విషయంలో సానుకూలంగా లేరు. వైసీపీకే మద్దతుగా ఉండేవారు. ఇటీవలి కాలంలో బీజేపీలోకి వలస నేతలు రావడంతో.. ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది. బీజేపీ ఏపీ అధ్యక్షపదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.. కానీ కన్నా లక్ష్మినారాయణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో.. టీడీపీ నుంచి పలువురు నేతలు.. బీజేపీలో చేరడంతో.. వారి హవానే ఎక్కువగా ఉంది. దీంతో.. సోము వీర్రాజును పట్టించుకునేవారే కరువయ్యారు. గాంధీ సంకల్పయాత్రల్లోనూ.. సోము వీర్రాజుకు కనీస సమాచారం లేదు. దాంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి పోతుంది. ఇంకో ఏడాది వరకూ ఆ పదవి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close