పదవీ లేదు… పిలిచే పెదవీ లేదు..!!

తెలంగాణ రాష్ట్ర సమితిలో కొందరు నాయకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్నికలకు ముందు కొందరు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి కొందరు, కొన్ని సంవత్సరాలుగా ఉన్న పార్టీని వదిలి ఇంకొందరు గంపెడాశలతో ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వారంతా తమను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదరిస్తారని, అక్కున చేర్చుకుని ఏదో ఒక పదవి ఇస్తారని అనుకున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాని ఏ ఒక్కరికి ఎలాంటి పదవి రావడం లేదు సరి కదా… కనీసం వారితో మాట్లాడే వారే కనిపించడం లేదని వారంతాసన్నిహితుల వద్ద వాపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వర రావు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన అంతకు ముందు మంత్రిగా చేశారు. ఈ ఓటమి తర్వాత ఆయనను పార్టీలో ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల ఓ సమావేశంలో తన అసంత్రప్తిని వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడని పేరు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో చేరారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటి పోతున్నా మండవ వెంకటేశ్వర రావుకు ఎలాంటి పదవి రాలేదు సరి కదా ఆయనతో కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెబుతున్నారు. దీంతో కినుక వహించిన మండవ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడడడం లేదని చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తన సొంతపార్టీ అని భావించిన కాంగ్రెస్ ను వదిలి ఎన్నికలకు ముందు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. సురేష్ రెడ్డి చేరిక సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ ఆయనను కడుపులో పెట్టుకుంటానని, తగిన రీతిలో గౌరవిస్తామని చెప్పారు. అయితే ఈయనకు కూడా పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఇక గత ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఆయన ప్రగతి భవన్ కు రావాలని, ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన మొర ఆలకించే వారే లేరంటున్నారు. అలాగే మాజీ స్పీకర్ మధు సూదనాచారి పరిస్థితి కూడా ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్ గా పని చేసిన ఆయన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నేటి వరకూ సీఎం కేసీఆర్ ను కలవాలని చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదని చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్శింహా రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పార్టీ కార్యాలయానికి వెళ్లినా అక్కడ ఆయనను పలకరించే వారే కరవయ్యారంటున్నారు. గత ఎన్నికల్లో తనకు కాకున్నా తన అల్లునికి టిక్కట్ ఇవ్వాలని నాయిని కోరారు. ఆ కోరికను కనీసం పట్టించుకోకపోగా ఆయనను కలిసేందుకు, మాట్లాడేందుకు కూడా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సముఖత చూపడం లేదని అంటున్నారు. ఇలా పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు అటు పదవులు రాక, ఇటు తమను పిలిచి మాట్లాడే వారు కూడా లేక లోలోపల కుమిలిపోతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close