ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడే బాగుండేది అన్న తెలంగాణ పేరెంట్

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల ఇప్పటికే 18 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రశ్నార్థకం చేసిందని బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా పేరెంట్స్ మరియు విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వచ్చి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కుందామని ప్రయత్నిస్తుంటే ఆఫీసు లోపలికి కూడా వీరిని అనుమతించకపోవడంతో ఇంటర్మీడియట్ బోర్డ్ పరిసరప్రాంతాలు ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొంతమంది పేరెంట్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి.

ఒక పేరెంట్ మాట్లాడుతూ, అసలు ఇంత అన్యాయమైన పరిస్థితి ఏంటని, తమ బిడ్డల భవిష్యత్తు ఇప్పుడు ఏం కావాలని ప్రశ్నిస్తూ, ” నేను తెలంగాణ వాడిని అయినప్పటికీ చెబుతున్నా, కనీసం ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడే పరిస్థితి కాస్త బాగుండేది. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ బోర్డ్ పూర్తిగా భ్రష్టు పట్టి పోయింది” అంటూ వ్యాఖ్యలు చేశారు. అగ్ర టీవీ ఛానల్ ఇస్తున్న లైవ్ లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఫ్ కోర్స్, ఏ ఛానల్ కూడా ఆయన వ్యాఖ్యలను హైలెట్ చేయడం కానీ, కెసిఆర్ కి వ్యతిరేకంగా ఒక పేరెంట్ చేసిన వ్యాఖ్యల లోని ఆవేదన ని ప్రతిఫలించే లాగా డిస్కషన్ పెట్టడం కానీ చేయలేదనుకోండి , అది వేరే విషయం.

ఏది ఏమైనా, గత 15 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఒక సమస్య కూడా రాకుండా పరీక్షలు నిర్వహించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థని పక్కనపెట్టి 2018లో ఏమాత్రం అనుభవం లేని, పైగా పలు యూనివర్సిటీలతో ఇప్పటికే కోర్టు కేసులో ఇరుక్కొని ఉన్న గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించడమే అంతటికి కారణం అని తెలుస్తోంది. ఈ సమస్యకు ప్రభుత్వం ఎంత త్వరగా పరిష్కారం చూపిస్తే, తల్లిదండ్రులకు ఇటు విద్యార్థులకు టెన్షన్ తగ్గించిన వారవుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close