‘ఖైదీ 2’…లో తెలుగు హీరో?

కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఖైదీ` మంచి విజ‌యాన్ని అందుకుంది. తెలుగులో డ‌బ్బింగ్ రూపంలో వ‌చ్చి ఇక్క‌డ కూడా మంచి వ‌సూళ్లు అందుకుంది. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. `ఖైదీ` హిట్ అవ్వ‌గానే `ఖైదీ 2`కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఓ ఖైదీ జైలు నుంచి విడుద‌లైన రోజు రాత్రి ఏం జ‌రిగింద‌న్న‌ది `ఖైదీ` క‌థ‌. అయితే ఆ ఖైదీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ `ఖైదీ 2`లో చూపించ‌బోతున్నారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇది ఖైదీకి ప్రీక్వెల్‌.

ఈ ఖైదీ 2 ని తెలుగు ప్రేక్షకుల‌కు మ‌రింత న‌చ్చేలా తీర్చిదిద్ద‌డానికి చిత్ర‌బృందం ప్ర‌య‌త్నిస్తోంది. ఖైదీ లో కార్తి త‌ప్ప‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న న‌టీన‌టులెవ‌రూ ఉండ‌రు. సినిమా మొత్తం త‌మిళ ధోర‌ణిలోనే సాగుతుంది. అయినా మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఆ చిన్న‌పాటి లోటుపాట్లు కూడా ఈ సీక్వెల్ లో ఉండ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు దర్శ‌క నిర్మాత‌లు. ఈ సీక్వెల్ లో తెలుగు న‌టీన‌టుల‌కు త‌గిన స్థానం ఇవ్వాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా కార్తి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీల‌క‌మైన ఓ పాత్ర కోసం ఓ తెలుగు యువ క‌థానాయ‌కుడ్ని ఎంచుకుంటార‌ని తెలుస్తోంది. ఈ పాత్ర క‌థ‌కు చాలా కీల‌క‌మ‌ని తెలుస్తోంది. `ఖైదీ`లో క‌థానాయిక లేదు. ఆ అవ‌స‌ర‌మే రాలేదు. అయితే సీక్వెల్ లో మాత్రం క‌థానాయిక పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర‌లోనూ తెలుగు చిత్ర‌సీమ‌కు బాగా ప‌రిచ‌య‌మున్న నాయిక‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల వివ‌రాల్ని అధికారికంగా వెల్ల‌డిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close