లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మరింత ఎగబాకి అగ్రస్థానానికి చేరుకుంది. సిరీస్‌ను భారత్ 3-1 తో కైవసం చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేయగా… ఇంగ్లండ్ 205 పరుగులు చేసింది ,  రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. చెరో 5 వికెట్లు తీసిన అశ్విన్, అక్షర్‌ పటేల్‌ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. క్లిష్టతరమైన పిచ్‌పై భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు మంచి పరిణితి కనబరిచారు. రిషబ్ పంత్ తన విధిని నిర్వహించగా.. వాషింగ్టన్ సుందర్.. అత్యంత విలువైన పరుగుల్ని జోడించారు. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో. అహ్మదాబాద్ పిచ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నాలుగో టెస్ట్ కూడా అక్కడే జరుగింది. అయితే పిచ్ ను మార్పు చేశారు. బ్యాటింగ్ పిచ్ అని మొదట్లో ప్రచారం జరిగినా… తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్‌కు పిచ్ అర్థం కాలేదు. బోల్తా కొట్టారు.

గజరాత్‌కు చెందిన బౌలర్ అక్షర్ పటేల్.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత భారత్ వేగంగా పుంజుకుంది. వరుసగా మూడు టెస్టులు గెలిచి సిరీస్ అందుకుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది. లార్డ్స్‌లో కూడా గెలిస్తే… చరిత్ర సృష్టించినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close