బీజేపీకి ఆయుధంగా అక్బరుద్దీన్ కేసు తీర్పు !

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన రెండుకేసులను కోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్య పరిచింది. నిర్మల్‌తో పాటు మరో చోట హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించింది. హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాదాపుగా నెలన్నర పాటు ఈ కేసుల్లో జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కేసుల్లో సాక్ష్యాలు తెలంగాణ పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీన్ని బీజేపీ ఆయుధంగా చేసుకుంది.

న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలనివాటిని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించ లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ కేసు తీర్పుపై రెండురోజులు ఉత్కంఠ నెలకొంది. అయనకు శిక్ష ఖాయమని అందరూ అనుకున్నారు.

కానీ కేసును నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో న్యాయమూర్తి కూడా ఇది సంబరాల చేసుకునేది కాదని మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయన్నారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ హిందువుల్ని అన్నన్ని మాటలన్నా… వదిలి పెట్టారన్న ఆరోపణలు బీజేపీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close