నారాయణఖేడ్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ గెలిచినా లాభం లేదా?

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ శాసనసభ సభ్యుడు కిష్టారెడ్డి మరణం కారణంగా వచ్చే నెల 13న జరుగబోయే ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడు సంజీవ రెడ్డినే అభ్యర్ధిగా నిలుపుతోంది. ఆయనను పార్టీలోకి ఆకర్షించి తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని తెరాస భావించింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చేయి. కానీ ఆయన మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలలో తమ అభ్యర్ధిగా భూపాల్ రెడ్డిని నిలబెడుతున్నట్లు తెరాస ప్రకటించింది. వరంగల్ ఉప ఎన్నికలలో పట్టుబట్టి తెదేపా నుంచి సీటు తీసుకొని ఘోరపరాజయం పాలయిన బీజేపీ ఈసారి నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని తెదేపాకు విడిచి పెట్టేసింది. కనుక తెదేపా తరపున విజయపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసాయి కనుక ఇక ప్రచారం జోరందుకోవచ్చును.

ఈ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధిని గెలిపించే బాధ్యత మంత్రి హరీష్ రావుకి అప్పగించబడింది కనుక ఆయన చాల రోజులుగా అక్కడే మకాం వేసి ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తున్నారు. తెరాస అభ్యర్ధి భూపాల్ రెడ్డి గత ఎన్నికలలో కిష్టారెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్ళీ ఆయన కొడుకు సంజీవ రెడ్డితో పోటీ పడుతున్నారిప్పుడు. ఒకవేళ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కిష్టారెడ్డి కుటుంబం పట్ల ప్రజలలో ఇంకా సానుభూతి నెలకొని ఉంటే ఆయన కుమారుడు సంజీవ రెడ్డికే విజయావకాశాలుంటాయి.

కానీ ఆయన గెలిచినంత మాత్రాన్న కాంగ్రెస్ పార్టీ సంబరపడటానికి కుదరక పోవచ్చును. ఎందుకంటే ఆయన ఈ ఎన్నికలకు ముందే తెరాసలోకి వెళ్ళిపోవాలని చూసారు. ఒకవేళ ఆయనే గెలిచినట్లయితే,ఆయనని తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చును. తెరాస ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక దానిలోకి ఆయన మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆయన ఈ ఎన్నికలలో గెలిచినా తరువాత తెరాసలోకి మారినట్లయితే, ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పడిన శ్రమ అంతా వృధా అయిపోయినట్లే.పైగా కాంగ్రెస్ ఖాతాలో చేరవలసిన ఎమ్మెల్యే సీటు తెరాస ఖాతాలోకి వెళ్ళిపోతుంది. మరి ఈవిషయం కాంగ్రెస్ నేతలకి తెలియదనుకోలేము. అయినా సంజీవ రెడ్డికే పార్టీ టికెట్ ఇచ్చేరంటే ఎన్నికల తరువాత ఆయన పార్టీ మారబోరని గట్టి నమ్మకం ఉందనుకోవాలా? ఏమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close