జగన్‌కు చేరిన టిక్కెట్ రేట్ల రిపోర్ట్.. !

సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే రెండు సార్లు మంత్రి పేర్ని సీఎం జగన్‌ను కలిసి వివరించారు. సినిమా టిక్కెట్ ధరలపై హైకోర్టు సూచనలతో ప్రభుత్వం నియమించిన కమిటీ పేర్ని నానికి నివేదిక సమర్పించారు. దాన్ని పేర్ని నాని సీఎం జగన్‌కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

టికెట్ ధరలు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మల్టీప్లెక్స్‌ టికెట్ల రేట్లలో పెద్దగా మార్పులు లేవు. కానీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెంచాలని సూచించారు. ఏ ప్రాంతం అయినా సరే, నాన్‌ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర రూ. 30 ఉండాలని సిఫారసు చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలే ఉంది. అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం 25రూపాయలు అదనం అవ్వబోతోంది. అలాగే నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను రూ. 70 కు రిపోర్ట్ ఇచ్చింది.

చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్‌తో ఎవరెవరు భేటీ అవబోతున్నారన్న అంశంపై స్పష్టత లేదు. కానీ అగ్రహీరోలు పాల్గొంటారని చెబుతున్నారు. ఉదయం మీడియాతో మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ ప్రభుత్వం తరపున మాట్లాడేందుకు ఛాంబర్ ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ ప్రధాన సమస్య.. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి అన్ లైన్ వ్యవస్ద పెట్టాలన్నది మా ఆలోచన అని వివరించారు. టిక్కెట్ రేట్ల తగ్గింపు సమంజసమేనన్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో ఏకాభిప్రాయం లేదన్న భావన ఏర్పడుతోంది. రేపు భేటీ తర్వాత మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close