ఉద్యోగులు వర్సెస్ ఉపాధ్యాయులు.. చిచ్చు పెట్టేసినట్లే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య చిచ్చు రేగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో తమను జేఏసీలో భాగం చేసి.. తమకు వాయిస్ లేకుండా చేసి సమ్మెను విరమించినట్లుగా ప్రకటన చేయించారని నలుగురు ఉద్యోగ సంఘ నేతలపై మండి పడుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఆ నలుగురు కౌంటర్ ఇచ్చారు. తమపై దారుణంగా ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని.. చనిపోయినట్లుగా శవయాత్రలు.. అలాగే మహరాజువయ్యా అనే పాటలు పెట్టి వీడియోలు తయారు చేస్తున్నారని ఉద్యోగ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాము సమ్మె చేయలేదనే ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారని.. వారి వెనుక ఎవరు ఉన్నారని ఉద్యోగ నేతలు ప్రశ్నించారు. ఉపాధ్యాయ నేతల వెనుక వెనుక కొన్ని శక్తులు దాగి ఉండొచ్చని అంటున్నారు. ఈ వాదన నిన్న సీఎం వ్యక్తం చేసిందే. ఉపాధ్యాయుల ముసుగులో రాజకీయశ్రేణులు దాడి చేస్తాయన్న ఆందోళన ఉద్యోగ నేతలు వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్‌పై మంత్రులు స్పష్టంగా చెప్పినప్పుడు నచ్చలేదని ముందే బయటకు వచ్చేయాల్సింది.

కానీ రాలేదని సమ్మె విరమించేందుకు అంగీకరించారని తర్వాత ఫోన్లు రావడంతో వారు వెళ్లిపోయారని ఆరోపించారు. సమ్మె జరగలేదనే ఫ్రస్టేషన్‌తో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు మీ కార్యాచరణ మీరు తీసుకోండి మాకు అభ్యంతరంలేదన్నారు. ఉద్యోగ సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసులతో రక్షణ కల్పించారని దాడులకు కుట్ర చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

తమ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం చేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఖండించారు. నలుగురు ఉద్యోగ సంఘ నేతలు తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. వారు ఆగ్రహంగా ఉండటంతో ఎపీఎన్జీవో భవన్‌కు.. ఉద్యోగ నేతల ఇళ్లకు పోలీసులు భద్రత కల్పించారు. నిన్నటిదాకా కలసి ఉద్యమం చేసిన రెండు వర్గాలు ఇప్పుడు కలహించుకోవాలని నిర్ణయించుకోవడంతో చిచ్చు పెట్టేశారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close