రాజ్యాంగం కోసం.. ఒక్క రోజు శాసనమండలి భేటీ..!

తెలంగాణ శాసనమండలి ఈ రోజు ఒక్క రోజు సమావేశం కానుంది. అదీ సంతాపాలు ప్రకటించి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన జాతీయ నేత‌ల‌తో పాటు కొండ‌గ‌ట్టు మృతుల‌కు మండలి తెలుపుతుంది. ఎప్పుడైనా శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే….అసెంబ్లీ, మండలి రెండూ ఒకే సారి భేటీ అవుతాయి. కాని ఈ సారి అసెంబ్లీ ర‌ద్దు కావ‌టంతో కేవ‌లం శాస‌న‌మండ‌లి స‌మావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోపు… చట్టసభలు తప్పనిసరిగా సమావేశం కావాలి. బ‌డ్జెట్ స‌మావేశాలు మార్చి 29 తో ముగియ‌డంతో ఈనెల 29 లోపు ఖ‌చ్చితంగా స‌భ నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగానే శాస‌న‌మండ‌లి స‌మావేశం కాబోతోంది.

అసెంబ్లీ ర‌ద్దు కావ‌డంతో శాస‌న‌మండ‌లిలో చ‌ర్చించేందుకు ఎజెండా ఏమీ లేదు. మండలి సమావేశమైన తర్వాత సంతాపాలు ప్రకటించి వాయిదా వేస్తారు ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ ప్రధాని వాజ్ పేయి, డీఎంకే అధినేత క‌రుణానిధి, మాజీ లోక్ స‌భ స్పీక‌ర్ సోమ్ నాధ్ చ‌ట‌ర్జీ, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ల వేణుమాధ‌వ్ తో పాటు కొండ‌గ‌ట్టు ప్రమాద మృతులు, గ‌త ఆరు నెల‌ల్లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా మృతి చెందిన వారికి స‌భ సంతాపం తెల‌పుతుంది. ఆ తర్వాత వాయిదా పడటం లాంఛనమే.

ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్….ఈ స‌మావేశాల‌ను ఉప‌యోగించాల‌ని భావిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రంలో నెల‌కొన్ని స‌మ‌స్యల‌పై స‌భ‌లో నిల‌దీసేందుకు వాడుకోవాల‌నుకుంటోంది. అందుకే వారంరోజులైనా సమావేశాలు జరపాలని కోరుతోంది. విభ‌జ‌న హామీల అమ‌లుపై చ‌ర్చకు అవ‌కాశం ఇవ్వాల‌ని కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉంది. కానీ పరిగణనలోకి తీసుకునే పరిస్థితి మాత్రం లేదనేది అందరికి తెలిసిన విషయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close