టీఆర్ఎస్ – బీజేపీవి ముందస్తు కోసం కూడబలుక్కున్న సవాళ్లే !?

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ముందస్తు కోసం పరస్పర సవాళ్లు చేసుకుంటున్నాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇద్దరూ వ్యూహాత్మకంగా సవాళ్లు చేసుకుంటున్నట్లుగా పరిస్థితి ఉంది. ఇటీవల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని అమిత్ షా సవాల్ చేశారు. దానికి పోటీగా దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల తేదీ పెట్టాలని అసెంబ్లీని రద్దు చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలతో రెండు పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రజల్ని సిద్ధం చేస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వస్తోంది.

అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలు పెట్టరేమోనని ఇప్పటి వరకూ కేసీఆర్ డౌట్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనల్లో ఎప్పట్నుంచో ఉన్నారు. ఎన్నికల తేదీని ప్రకటిస్తే తానే అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం సహకరించదన్న కారణగానే ఆగిపోతున్నట్లుగా ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎన్నికలు జరపకుండా రాష్ట్రపతి పాలన విధిస్తారన్న అనుమానం టీఆర్ఎస్ అధినేతలో ఉంది. 2018లో ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముందస్తుకు సంపూర్ణంగా సహకరించారు. అయితే ఈ సారి మాత్రం బహిరంగ యుద్ధం చేస్తున్నారు. అందుకే బీజేపీ సహకరించదని నమ్మకంతో ఉన్నారు. అందుకే వాళ్లని రెచ్చగొట్టి అయినా ఎన్నికలకు పెట్టే ఉద్దేశంతో కేసీఆర్ ఇలా అన్నారని భావిస్తున్నారు.

ఎన్నికలకు సిద్ధమని సంకేతాలు పంపుతున్న బీజేపీ నేతలు !

అయితే బీజేపీ నేతలు చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలు ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన రెండు సార్లు ముందస్తు గురించి చెప్పారు. తెలంగాణ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ముందస్తు వస్తాయి సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో బీజేపీ నేతలు వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పద్దతిలో సవాళ్లు చేస్తూండటంతో వ్యూహాత్మకంగానే రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాని నమ్ముతున్నారు.

ముందస్తు కోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయా ?

రెండు పార్టీలు సవాళ్లు చేసుకుని ముందస్తుకు వెళ్తే.. రెండు పార్టీల మధ్య పోటీ ఉందని జనం అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీని మాత్రం రేసులో లేకుండా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఏ ఎన్నిక జరిగినా బీజేపీనే ప్రత్యర్థిగా ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే.. బీజేపీ, టీఆర్ఎస్ పైకి ఫైటింగ్ చేస్తూ.. పైకి ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలవనున్నాయి. కానీ ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం వాటి మధ్య స్పష్టమైన అవగాహన ఉందని అనుమానాలు కలుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close