మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి… తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ దావోస్‌లో ఈగలు తోలుకుంటున్నారట. ఈ విషయాన్ని కేటీఆర్ సహచర మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారు. కేటీఆర్ తెలంగాణ కోసం పెట్టుబడుల వరద పారిస్తూంటే… ఎవరూ రాక… ఎవరూ పెట్టుబడులపై ఆసక్తి చూపించక జగన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో స్వయంగా కేటీఆరే ఏపీని నరకంగా అభివర్ణించారు.

అప్పుడు కూడా వైసీపీ పెద్దలు ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కేటీఆర్‌కు ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ అసలు నోరెత్తలేదు. పైగా దావోస్‌ల కలువగానే అపూర్వ సహాదరుల్లా ఫోటోలు తీసుకున్నారు. కేటీఆర్ వాటినిసోషల్ మీడియాలో పెట్టారు. అవి ట్రెండింగ్‌లో ఉండగానే ఇటు పువ్వాడ అజయ్ మరోసారి జగన్ పై విమర్శలు చేశారు. నిజానికి ఏపీ పెవిలియన్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగడంలేదు.

కాంగ్రెస్ సెంటర్లో జరిగే కార్యక్రమాలకు వెళ్తున్న జగన్ అక్కడ వారికి ఏపీ తరపున బ్యాగులు ఇచ్చి ఫోటోలు దిగి.. వాటిని తన పీఆర్ టీం ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయించుకుని.., వాటికి భేటీలని ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కాదు కదా అసలు ఏపీలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా బడా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించడం లేదు. దీన్నే తెలంగాణ నేతలు కూడా ఎత్తి చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close