తుమ్మ‌ల వ‌ర్గం ప్ర‌త్యేకంగా ఎందుకు స‌మావేశ‌మైంది..?

తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న వ‌ర్గనేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు. ఉన్న‌ట్టుండి ఈ స‌మావేశం ఎందుక‌య్యా అంటే… తెరాస పార్టీని బ‌లోపేతం చేసుకోవడానికీ, ఖ‌మ్మం జిల్లాలో పార్టీని మ‌రింత స‌మ‌ర్థంగా త‌యారు చేయ‌డానికి అని తుమ్మ‌ల వ‌ర్గీయులు చెబుతున్నారు. కానీ, అస‌లు కార‌ణం ఏంటంటే… తుమ్మ‌ల వ‌ర్గీయులు ఈ మ‌ధ్య అసంతృప్తిగా ఉండ‌ట‌మే. నిజానికి మూడు రోజుల కింద‌టే ఈ వ‌ర్గం నేత‌లు తొలిద‌ఫా స‌మావేశం నిర్వ‌హించారు. పార్టీకి సంబంధించిన ప‌ద‌వుల విష‌యంలో త‌మకు అన్యాయం జ‌రుగుతోందంటున్నారు. ఇక‌పై మేమే అభివృద్ధి ప‌నులు చూసుకుంటామ‌నీ, తామే క‌మిటీల‌ను వేసుకుంటామంటూ తుమ్మ‌ల వ‌ర్గం తాజాగా ఓ తీర్మానం చేసుకోవ‌డం విశేషం. దీన్ని పార్టీ అధినాయ‌క‌త్వానికి పంపిస్తామంటున్నారు.

ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డికీ, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకీ ఈ మ‌ధ్య అస్స‌లు ప‌డ‌టం లేద‌న్న‌ది తెలిసిందే. కందాల తెరాస‌లో చేరిన ద‌గ్గ‌ర్నుంచీ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చినవారికే స్థానికంగా ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నీ, నిజ‌మైన తెరాస నాయ‌కుల్నీ ముఖ్యంగా తుమ్మ‌ల అనుచ‌రుల్ని ఆయ‌న ప‌క్క‌న‌పెడుతున్నార‌ట‌! ఇది ఆ వ‌ర్గానికి మింగుడుప‌డ‌టం లేదు. అంతేకాదు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆ వ‌ర్గాన్ని కందాల క‌లుపుకుని పోవ‌డం లేద‌ట‌. అయితే, దీన్ని ఒక ఫిర్యాదులా కాకుండా… ఉల్టా చేసి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు నాయ‌క‌త్వంలో అంద‌రూ న‌డ‌వాల్సి ఉంద‌నే అభిప్రాయాన్ని ఆ వ‌ర్గ నేత‌లు మీడియా ముందు చెబుతున్నారు. పాలేరు నియోజ‌క వ‌ర్గానికి తుమ్మ‌ల చాలా అభివృద్ధి చేశార‌నీ, ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ దాన్ని గుర్తుపెట్టుకుంటున్నార‌నీ, కాబ‌ట్టి తుమ్మ‌ల స‌హాకారంతో ఎమ్మెల్యే కందాల‌ను కూడా క‌లుపుకుని పోయి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల‌న్న‌దే త‌మ ల‌క్ష్యం అంటున్నారు.

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల‌పై కందాల గెలిచిన సంగ‌తీ తెలిసిందే. ఆ త‌రువాత‌, కాంగ్రెస్ నుంచి ఆయ‌న తెరాస‌లోకి వ‌చ్చి చేరారు. దీంతో, స‌హ‌జంగానే వ‌ర్గ‌పోరు మొద‌లౌతుంది. గెలిచిన ఎమ్మెల్యేగా కందాల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. ఆయ‌న‌కి ప్రోటోకాల్ ఉంటుంది. ఇదే అవ‌కాశంగా త‌న ప‌ట్టు పెంచుకోవ‌డం కోసం కందాల ప్ర‌య‌త్నిస్తారు క‌దా. ఇప్పుడు జ‌రుగుతున్న‌దీ అదే. దీంతో, తుమ్మ‌లను ప‌క్క‌న‌పెడుతున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. ఈ అసంతృప్తిని తుమ్మ‌ల ఈవిధంగా వెళ్ల‌గ‌క్కుతున్న‌ట్టు! మ‌రి, తుమ్మ‌ల వ‌ర్గం భేటీపై పార్టీ అధినాయ‌క‌త్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వ‌ల‌సల‌ ప్రోత్సాహం సైడ్ ఎఫెక్ట్ గా ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చూడొచ్చు. ఓడిన ఎమ్మెల్యే అభ్య‌ర్థీ, గెలిచిన ఎమ్మెల్యే… ఇద్ద‌రూ ఒకేపార్టీలో ఉంటే ఏమౌతుంది… వ‌ర్గ‌పోరు మొద‌లుకాక‌! ఇలాంటి పంచాయితీలు ఇంకా మున్ముందు చాలా ఉండే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close