మోడీకి ఆ పరిస్థితి కల్పించాలి: విజయమ్మ

ప్రతీ రాజకీయ పార్టీలోకొందరు గెస్ట్ ప్లేయర్స్ ఉంటారు. ఎప్పుడో అవసరంపడినప్పుడే వారు ప్రజల ముందుకు వచ్చి తమ పార్టీ తరపున వఖాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటారు. వైకాపాలో కూడా అటువంటి ఇద్దరు గెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వారిలో ఒకరు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ. మరొకరు ఏ పదవీలోను లేని షర్మిల. విజయమ్మ కనబడి చాలా రోజులయిందే అని జనం అనుకొంటుంటే శనివారం ఆమె జగన్ దీక్షలో ప్రత్యక్షమయ్యారు.

ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి ఆమె ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా ప్రసంగించారు. “నా కొడుకు జగన్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత అతనిని మీ చేతులోనే పెట్టాను. అప్పటి నుండి అతను రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకొన్నా, ప్రజలకు ఏ సమస్య ఎదురయినా తక్షణమే వచ్చి వారికి అండగా నిలబడి పోరాడుతున్నాడు. కనుక అతనిని మీరు ఆశ్వీరదించాలి. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతోందో, అది వెనకడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దానిని గట్టిగా అడగడం లేదో నాకు తెలియదు కానీ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నా కొడుకు జగన్ పోరాడుతున్నాడు. దాని వలన అతనికి వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమీ లేదు. కేవలం ప్రజల కోసమే అతను పోరాడుతున్నాడు. కనుక రాష్ట్ర ప్రజలందరూ అతనికి అండగా నిలబడి పోరాడాలి. ఆ పోరాటం ఎంత తీవ్రంగా ఉండాలంటే రాజధాని శంఖుస్థాపన చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అది చూసి తక్షణమే ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించాలి,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close