విజయసాయిరెడ్డి కలలోకి కూడా రెడ్‌బుక్ వస్తోందా !?

లోకేష్ రెడ్‌బుక్ చూపిస్తున్నారని భయపడిపోయి ఆయనను అరెస్టు చేస్తామని సీఐడీ కోర్టుకు వెళ్లింది. ఒక్క సీఐడీనే కాదు.. విజయసాయిరెడ్డి కూడా రెడ్ బుక్ జపం చేస్తున్నారు. విచిత్రంగా ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్న ఫోటోను తీసుకు వచ్చి మరీ ఫిర్యాదు చేశారు. తాను ఇలా కంప్లైంట్ చేశానని మీడియాకు చెప్పారు. తప్పు చేసిన అధికారులను వదిలేది లేదని లోకేష్ హెచ్చరిస్తూంటే..దానికి ఈసీ ఏం చేస్తుందన్నదానిపై విజయసాయిరెడ్డికి స్పష్టత ఉందోలేదో కానీ.. ఆ రెండు బుక్ చూసి భయపడుతున్నారన్న వాదనకు మాత్రం బలం చేకూరింది.

తప్పుడు పనులు చేసి.. చట్టాలను ఉల్లంఘించి టీడీపీనేతలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని లోకేష్ చెబుతున్నారు. అయితే కొంత మంది భుజాలు తడుముకుంటూ.. మమ్మల్నే అంటున్నాడని తెర ముందుకు వచ్చేస్తున్నారు. నిజానికి ఏపీలో పిడికెడు మంది తప్పుడు అధికారులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం మారితే వారి పరిస్థితి ఏమిటన్నది నిజాయితీగా పని చేసిన అధికారుల్లో చర్చ జరుగుతూనే ఉంది. తప్పుడు పనులు చేసిన వారిని ఇలాంటి ఫిర్యాదులు కాపాడలేవన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈసీని కలిసిన విజయసాయిరెడ్డి విచిత్రమైన ఫిర్యాదులు చేశారు. అసలు బోగస్ ఓట్లు లేవని.. బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రివర్స్ లో డిమాండ్ చేశారు. అంతేనా అసలు పవన్ కల్యాణ్ పార్టకి గుర్తింపు లేదని ఆయనకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారని కూడా ప్రశ్నించారట.

టీడీపీ అలయన్స్ పార్టీ కాబట్టి ఇచ్చామని ఈసీ అధికారులు చెబితే అలా ఇవ్వకూడదని రెచ్చిపోయారట. జనసేన గుర్తుగా గాజు గ్లాస్ ఇవ్వకూడదని కూడా ఫిర్యాదు చేశారు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా.. విజయసాయిరెడ్డికి అధికారం పోతుందని తెలియగానే మందబుద్ది వచ్చేస్తోందని.. ఎవరి దగ్గర ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వాలో కూడా తెలియనట్లుగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close