జగన్ ఇప్పుడైనా నోరు తెరవాలంటున్న ఉండవల్లి !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోడీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రచ్చ రచ్చ అవుతోంది.కానీ ఏపీ పార్టీలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. అయితే రాష్ట్ర విభజన చట్టబద్ధంగా జరగలేదని న్యాయపోరాటం కూడా చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండబట్టలేకపోయారు. ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో ప్రధాని అన్న మాటలు వంద శాతం నిజం అని ..విభజన బిల్లును లోపభూయిష్టంగా ఉందని.. చర్చ లేకుండా ఆమోదించారని ఉండవల్లి విమర్శించారు.

రాజధాని లేకుండా బిల్లు ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. తలుపులు మూసేసి ప్రజాస్వామ‌్య విరుద్ధంగా విభజన చేశారన్న మోదీ మాటలు కరెక్టేనన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అలుసైపోయిందని.. ప్రధాని అన్న మాటలన్నా ఒక్క ఎంపీ కూడా నోటీసు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు అడిగినన్నీ సీట్లు ఇచ్చి చక్రవర్తిగా కూర్చోబెట్టారని .. మోదీ అన్న మాట మాటలనే ఆయకు గుర్తు చేసి.. విభజన అంశాలపై ప్రస్తావించాలని.. తమకు ఎందుకు ముంచేశారో అడగాలని జగన్‌ను కోరారు. రాబోయే రోజుల్లో ఏపీ అంటే అసలు ఎవరూ పట్టించుకోరని నిర్వేదం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని విమర్శించారు. విభేధించిన ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ కేసులతో భయపెడుతోందన్నారు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏపీకి ఇక ముందు ఎవరూ పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే విభజన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేశారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఓ పుస్తకం కూడా రాశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close