వినాయ‌క్ ‘రివెంజ్‌’ తీర్చుకుంటున్నాడా?

త‌మిళంలో కొంత‌మంది ద‌ర్శ‌కులు న‌టులుగానూ స‌క్సెస్ అయ్యారు. స‌ముద్ర‌ఖ‌నిలాంటివాళ్లు అందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం కూడా మానేసి.. న‌ట‌న‌పై దృష్టి కేంద్రీక‌రించేంత పెద్ద న‌టుడైపోయాయి. తెలుగులో అలాంటి వాళ్లు చాలా త‌క్కువ‌. పూరి, శ్రీ‌కాంత్ అడ్డాల‌, శేఖ‌ర్ క‌మ్ముల‌లాంటి వాళ్లు అప్పుడ‌ప్పుడూ… త‌మ సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల ద్వారా మెరుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వినాయ‌క్ హీరో అయిపోతున్నాడు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో వినాయ‌క్ హీరోగా ఓ సినిమా రూపొందుతుతోంది.

అయితే ఇది క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌లో ఉండే క‌థ కాదు. పాట‌లు, ఫైటింగులు ఏమీ క‌నిపించ‌వు. ఓ మైండ్ గేమ్‌తో సాగే రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. క‌థానాయ‌కుడి పాత్ర‌కు ఎలాంటి ఇమేజీ ఉండ‌కూడ‌దు. అంతేకాదు.. వ‌య‌సు పైబ‌డిన‌వాడిలానూ క‌నిపించాలి. అందుకే వినాయ‌క్‌ని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం వినాయ‌క్ బ‌రువు త‌గ్గాల‌ని నిర్ణ‌యించుకున్నారట. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తులు సాగుతున్నాయి. వినాయ‌క్ బ‌రువు త‌గ్గాకే ఈ ప్రాజెక్టు మొద‌ల‌వ్వ‌బోతోంద‌ని తెలుస్తోంది. `ఠాగూర్‌`లో ఓ చిన్న పాత్ర‌లో వినాయ‌క్ కనిపించ‌డం గుర్తుండే ఉంటుంది. న‌టుడిగా వినాయ‌క్ అవ‌తార్తం ఎత్త‌డం యాదృచ్చికంగా జ‌రిగింది. ఆ పాత్ర వేయాల్సిన న‌టుడు స‌రైన స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో.. చిరంజీవి స‌ల‌హాతో ఆప‌ధ‌ర్మ న‌టుడిగా అవ‌తారం ఎత్తాడు వినాయ‌క్‌. మ‌రి `హీరో`గా ఏ మేర మెప్పిస్తాడో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close